టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు. కాంట్రవర్సీలకు కింగ్ అని చెప్పవచ్చు. నిత్యం ఏదో వివాదం అతడి చుట్టూ తిరుగుతునే ఉంటుంది. ఎప్పుడు వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు. నిత్యం ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై కామెంట్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల పై కూడా సెటైర్స్ వేస్తూ ఉంటాడు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా స్పందించారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు.
నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఆర్జీవి మిస్సింగ్ ట్రైలర్ ని చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బోరున ఏడ్చారు అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏడ్చిన వీడియోని ఎడిట్ చేసి మూవీ ప్రమోషన్స్ లో వాడేశారు. చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఇదేం వాడకం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొక వైపు టిడిపి నేతలు, రామ్ గోపాల్ వర్మ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…