Director Relangi Narasimharao : పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు.ఇక రేలంగి గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎక్కువ సినిమాలను తీశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే ఈయన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దొడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తీసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు ముప్పై సినిమాలను చేసారు రేలంగి. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా మంచి హిట్ . ఇక ఆ సినిమా అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు రేలంగి గారు.
బాలాదిత్య ను తీసుకోడానికి కారణం అదే….
‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక పిసినారి. ఆయన పిసినారితనం భరించలేక ఆయన భార్య దివ్యవాణి విడిపోతుంది. వారి కొడుకుగా పిసినారి తండ్రికి తగ్గ తనయుడిగా బాలాదిత్య ఆ సినిమాలో బాగా నటించాడు. అయితే మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలాదిత్య అన్న కౌశిక్ ను సెలెక్ట్ చేశారట. కొన్ని సీన్స్ తనకి చేయమని చెప్పి కౌశిక్ చేసాక ఓకే చేశారట రేలంగి.
అయితే బాలాదిత్య వచ్చి నేను చేస్తాను ఒకసారి చుడండి అని చెబితే సరే అయితే బట్టలు లేకుండా కేవలం లో దుస్తులతో చేయాలి చేస్తావా అని అడిగితే చేస్తాను అంకుల్ అని ఏ మాత్రం కెమెరా అంటే బెరుకు లేకుండా చేసాడట. ఇక సినిమాలో ఐస్ గడ్డ మీద కూర్చొని పందెం గెలిచే సీన్ ఉండటం వల్ల ఆ క్యారెక్టర్ కి బాలాదిత్య అయితే సరిపోతాడని అనిపించిందట రేలంగి గారికి. అధికాక కౌశిక్ కొంచం పెద్ద పిల్లవాడు. బాలాదిత్య చిన్నవాడు కాబట్టి ఇంకా బాగుంటుందని భావించి వాళ్ళ పేరెంట్స్ కే డెసిషన్ వదిలేసారట. ఇక బాలాదిత్య, కౌశిక్ వల్ల నాన్న శంకర్ గారు కౌశిక్ కి వేరే సినిమాలు ఉన్నాయి బాలాదిత్య ఇప్పటివరకు ఇంకా సినిమాల్లో చెయలేదు తానే చేస్తాడు లెండి అని చెప్పారట. అలా సినిమాలో బాలాదిత్య రాజేంద్ర ప్రసాద్ జోడి మంచి హాస్యం పండించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…