Director Relangi Narasimharao : పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు.ఇక రేలంగి గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎక్కువ సినిమాలను తీశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే ఈయన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దొడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తీసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు ముప్పై సినిమాలను చేసారు రేలంగి. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా మంచి హిట్ . ఇక ఆ సినిమా అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు రేలంగి గారు.
బాలాదిత్య ను తీసుకోడానికి కారణం అదే….
‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక పిసినారి. ఆయన పిసినారితనం భరించలేక ఆయన భార్య దివ్యవాణి విడిపోతుంది. వారి కొడుకుగా పిసినారి తండ్రికి తగ్గ తనయుడిగా బాలాదిత్య ఆ సినిమాలో బాగా నటించాడు. అయితే మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలాదిత్య అన్న కౌశిక్ ను సెలెక్ట్ చేశారట. కొన్ని సీన్స్ తనకి చేయమని చెప్పి కౌశిక్ చేసాక ఓకే చేశారట రేలంగి.
అయితే బాలాదిత్య వచ్చి నేను చేస్తాను ఒకసారి చుడండి అని చెబితే సరే అయితే బట్టలు లేకుండా కేవలం లో దుస్తులతో చేయాలి చేస్తావా అని అడిగితే చేస్తాను అంకుల్ అని ఏ మాత్రం కెమెరా అంటే బెరుకు లేకుండా చేసాడట. ఇక సినిమాలో ఐస్ గడ్డ మీద కూర్చొని పందెం గెలిచే సీన్ ఉండటం వల్ల ఆ క్యారెక్టర్ కి బాలాదిత్య అయితే సరిపోతాడని అనిపించిందట రేలంగి గారికి. అధికాక కౌశిక్ కొంచం పెద్ద పిల్లవాడు. బాలాదిత్య చిన్నవాడు కాబట్టి ఇంకా బాగుంటుందని భావించి వాళ్ళ పేరెంట్స్ కే డెసిషన్ వదిలేసారట. ఇక బాలాదిత్య, కౌశిక్ వల్ల నాన్న శంకర్ గారు కౌశిక్ కి వేరే సినిమాలు ఉన్నాయి బాలాదిత్య ఇప్పటివరకు ఇంకా సినిమాల్లో చెయలేదు తానే చేస్తాడు లెండి అని చెప్పారట. అలా సినిమాలో బాలాదిత్య రాజేంద్ర ప్రసాద్ జోడి మంచి హాస్యం పండించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…