Director Teja : 1988 అక్కినేని నాగేశ్వరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో “రావుగారిల్లు” సినిమా షూటింగ్ జరుగుతుంది…దర్శకుడు తరనీ రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా రాంగోపాల్ వర్మ చేస్తున్నాడు. ఒకరోజు షూటింగ్ విరామంలో అదే సినిమాకి అసిస్టెంట్ కెమెరామెన్ గా చేరిన తేజతో.. షూటింగ్ కోసం డే లైట్ లుక్ కు సంబంధించి అడుగగా 10 రకాలుగా చెప్పడంతో రాంగోపాల్ వర్మ చాలా ఇంప్రెస్ అయ్యారు. తను తీయబోయే సినిమాకి తేజను కెమెరామెన్ గా పెట్టుకుంటానని తనతో హైదరాబాదు రమ్మని చెప్పారు. కెమెరామెన్ మహాదేవ్ తో జరిగిన విషయం చెప్పగా అసలు రాముకి దర్శకత్వం చేసే అవకాశం ఎవరిస్తారు? నువ్వు ఎలా కెమెరామెన్ అవుతావని తేజను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ తేజ ఆయన మాట వినకుండా రాముతో హైదరాబాద్ వచ్చాడు.
శివ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణిని, కెమెరామెన్ గా తేజని పెట్టుకుందామనుకున్నారు. కానీ నిర్మాతలు సురేంద్ర, వెంకట్ అందరూ కొత్తవారవుతున్నారు అనే ఉద్దేశంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజాను, కెమెరామెన్ గా ఎస్ గోపాల్ రెడ్డిని పెట్టుకున్నారు. అలా తేజకు కెమెరామెన్ గా అవకాశం రాకుండా పోయింది…ఆ తర్వాత రాంగోపాల్ వర్మ “రాత్రి” అనే సినిమాకు తేజను కెమెరామెన్ గా పెట్టుకున్నారు. సినిమా పెద్ద ఆడకపోయినా తేజకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హిందీలో కొన్ని చిత్రాలకు కెమెరామెన్ గా చేస్తున్నప్పుడు కొన్ని సీనులకు తేజానే దర్శకుడిగా పని చేశారు. ఆ క్రమంలో ఒక కథ రాసుకున్నారు. అది రామోజీరావుకు నచ్చడంతో ఉదయ్ కిరణ్,రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా “చిత్రం” సినిమాని రూపొందించారు.
అది మంచి విజయం సాధించడంతో రెండవ చిత్రంగా “నువ్వు నేను” అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమాకి హీరో మాధవన్ ను అనుకున్నారు. కానీ అయన తెలుగులో నటించడానికి ఇష్టపడలేదు. చిత్రం సినిమా తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఉదయ్ కిరణ్ తరచూ తేజ ఆఫీస్ కి వస్తూ ఉండేవాడు. వెంటనే నువ్వు నేను చిత్రానికి తిరిగి ఉదయ్ కిరణ్ నే హీరోగా తేజ ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ ఎవరని వెతుకుతున్న తరుణంలో ఆడిషన్స్ లో ఒక ఆరుగురు అమ్మాయిలను సెలెక్ట్ చేశారు. వీరిలో ముంబైకి చెందిన ఒక అమ్మాయిని హీరోయిన్ గా అనుకున్నారు.
కానీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో స్పెషల్ ఏ.సి రూమ్.. అడిషనల్ ఫెసిలిటీస్ కావాలని ఆమె డిమాండ్ చేశారు. తేజకు ఒక్కసారి కోపం వచ్చింది. ఆ అమ్మాయితో ఈ ఆడిషన్స్ కు వచ్చిన అమ్మాయిల్లో ఎవరు బాగోలేరని మీరు అనుకుంటున్నారని అడుగగా.. ఆమె ఒక అమ్మాయిని చూపించారు. ఆమె ఎవరో కాదు “నువ్వు నేను” చిత్రంలో హీరోయిన్ గా నటించిన అనిత. చివరికి ఆ అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేసి “నువ్వు నేను”సినిమా తీశారు. డైరెక్టర్ తేజ ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఇదంతా గమనిస్తున్న వారు మొదట తేజకు తిక్కుందనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన పనికి ఓ లెక్కుందని సముదాయించుకున్నారు. ఏదైతేనేం మొత్తానికి వర్మ శిష్యుడు అనిపించుకున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…