కైకాల సత్యనారాయణ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతను తెలుగు సిని ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.ఆయన దాదాపు 700 సినిమాలకు పైగా నటించాడు.నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసారు. దాదాపుగా ఆరు దశాబ్దాల నటనా జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించారు.
అంతేకాకుండా ఏడాదికి పదికి పైగా చిత్రాలు చేసేవారు. వీటిలో ఎక్కువగా ఆయన విలన్ పాత్రలో చేసిన సినిమాలే ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుంచి బాలకృష్ణ,నాగార్జున, చిరంజీవిల సినిమాలలో విలన్ పాత్రలో నటించారు. యుక్త వయసులో ఉన్న కైకాల సత్యనారాయణకు, అమ్మాయిలను మోసం చేయడం, మానభంగాలకు పాల్పడడం, హింసించడం లాంటివి పాత్రలు ఎక్కువగా దక్కేవి. దీనితో ఆ పాత్రలో లీనమై ఆ పాత్రలలో విలనిజం పండించేవారు.
దీంతో అప్పట్లో ఆయనకు సొసైటీలో పూర్తిగా నెగిటివ్ ఇమేజ్ ఉండేది. మరీ ముఖ్యంగా అంటే ఆడవాళ్ళు కైకాల సత్యనారాయణ అంటే మండిపడే వారు. ఒకసారి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కైకాల సత్యనారాయణ పై ఆడవారు మాటల దాడి చేశారట. ఎందుకయ్యా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారని ఒక మహిళ నిలదీసిందట. ఈ విషయాలన్నీ కూడా కైకాల ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
ఇక ఆ రోజుల్లో ఈయన ఎక్కువగా మహిళలపై అత్యాచార పాత్రలో నటించడం వల్ల ఈయనను రేపుల నారాయణ అని కూడా పిలిచే వారట. సినిమాలో జరిగే దానిని నిజంగా భావించి అమాయకత్వం ప్రజలు, హీరో హీరోయిన్ లను అమితంగా ప్రేమించేవారు. కానీ విలన్ పాత్రలు చేసే నటులపై మాత్రం కోపం పెంచుకునేవారు. ప్రేక్షకులకు అంతలా కోపానికి గురి చేసి అంతా సహజమైన నటన నటించేవారు కైకాల సత్యనారాయణ. ఆ తర్వాత వయసు మీద పడటంతో విలన్స్ పాత్రలు తగ్గించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…