తాజాగా బిగ్ బాస్ హౌస్ లో నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా టాస్క్ రసవత్తరంగా సాగింది. ఈ క్రమంలోనే మానస్ కాజల్ ఆటను చూసి షాక్ అయ్యాడు. అతడు అనీ మాస్టర్ అంటే ఆమె సిరి అంటుంది. అతడు సిరి అంటే ఆమె అని మాస్టర్ అంటూ తన మాటే నెగ్గాలని ప్రయత్నించింది. వీరిద్దరూ తీసుకోకపోవడంతో అనీ మాస్టర్, సిరి ఫోటోలు కాలిపోయాయి. ఇక అందరి ఫోటోలు కాలిపోయినా సన్నీ ఫోటో కాలకపోవడంతో ఫ్రీ పాస్ దక్కడంతో సంతోషంతో స్టెప్పులు వేశాడు.
అప్పుడు యానీ మాస్టర్ డ్రామాలు ఆడుతున్నారు అంటూ కాజల్ ను ఏకి పారేసింది. ఆతర్వాత ఎమోషనల్ అవుతూ వాళ్లతో మాట్లాడేది లేదని శపథం చేసింది.తొండి గేములు, నాటకాలు అంటూ ఆవేశంలో మాటలు అనేసింది.ఇది చాలదు అన్నట్లు మంటను మరింత పెంచడానికి రవి ఇప్పుడు ఆడవాళ్ళను అడ్డంపెట్టుకుని గేమ్ ఆడింది సన్నీ కాదా!అంటూ హౌస్ మేట్స్ ను మరింత రెచ్చగొట్టాడు.
ఆ తర్వాత సిరిని నాగార్జున బాత్రూంలో ఎందుకు నిన్ను నువ్వు కొట్టుకొని గాయపరుచుకున్నావని సిరిని ప్రశ్నిస్తూ కన్వెన్షన్ రూమ్ లోకి పిలిచి మాట్లాడాడు. అసలు తన సమస్య ఏంటో చెప్పమని నాగ్ ప్రశ్నించాడు. ఈ విషయంపై స్పందిస్తూ సిరి నేను ఎమోషనల్ పర్సన్. నేను ఎదుటి వాళ్లను హర్ట్ చేసే వ్యక్తిని కాను, ఎవరేమన్నా నన్ను నేను బాధ పెట్టుకుంటాను. అలాగే రోజులు గడిచే కొద్దీ షణ్ముఖ్ తో నా కనెక్షన్ ఇంకా ఎమోషనల్ అయిపోతుంది. ఇది తప్పా కరెక్టా తెలియట్లేదు. లైఫ్ లో ఎప్పుడు ఇలా అవలేదు. నాకు ఈ ఫీలింగ్ తప్పని తెలిసినా సరే చేయాలనిపిస్తే చేసేస్తున్నా అని చెప్పు సిరి ఎమోషనల్ అయింది.
అనంతరం ఇంకొకసారి బిగ్ బాస్ హౌస్ లో ఇలా గాయపరుచు కుంటే హౌస్ నుంచి పంపించేస్తాను అంటూ నాగార్జున వార్నింగ్ ఇవ్వగా మరొకసారి రిపీట్ చేయను అంటూ సిరి మాట ఇచ్చింది. అనంతరం షణ్ముక్ ని పిలిచి నాగార్జున మాట్లాడగా..సిరి అలా తనను గాయపరచుకోవడానికి కారణం తానే అంటూ షణ్ముఖ్ తప్పును అంగీకరించాడు. దీప్తి సునైనా ను మిస్ అవుతున్నావా అని నాగార్జున ప్రశ్నించగా? అవును అంటూ తల ఊపాడు. అంతలా మిస్ అవుతుంటే ఇక్కడ ఉండలేకపోతే ఈ క్షణమే వెళ్ళిపో అంటూ గేటు తెరిచాడు నాగార్జున. బిగ్ బాస్ లో ఇలా పదే పదే ట్రిప్ అవకూడదని సూచించాడు .
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…