Naveen Polishetty: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?
Naveen Polishetty: టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన చిత్రం రాదే శ్యామ్.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోని పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో ఘనంగా జరుపుకుంది.
ఈ ఈవెంట్ కి ఎంతోమంది మేల్ యాంకర్స్ ఉండగా వారెవరినీ కాకుండా మన జాతి రత్నం నవీన్ పోలిశెట్టిని యాంకర్ గా తీసుకున్నారు.నవీన్ పోలిశెట్టి యాంకర్ గా మారడం ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతుంది. మన తెలుగులో ఎంతోమంది యాంకర్స్ ఉన్నప్పటికీ వారికి పాన్ ఇండియా స్థాయిలో యాంకరింగ్ చేసే అనుభవం లేకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టింగ్ చేయడం వల్ల సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో అతనిని తీసుకున్నట్లు సమాచారం.
నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ ముందుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా కోసం నవీన్ పోలిశెట్టి సైతం తనదైన శైలిలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టింగ్ చేశారు.
అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హోస్టింగ్ చేసినటువంటి నవీన్ పోలిశెట్టి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారని పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకు యాంకర్ గా చేసినందుకు ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు. కేవలం ప్రభాస్ తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాకు ఫ్రీ గా అతను యాంకరింగ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి నవీన్ పోలిశెట్టి ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…