Movie News

సుహాసిని -మణిరత్నం పెళ్లి ఎలా జరిగిందో తెలుసా?

దక్షిణాది రాష్ట్రాలలో డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి దర్శకుడు మణిరత్నం ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. మణిరత్నం సినీనటి హీరోయిన్ సుహాసిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి పెళ్లి గురించి అనేక వదంతులు వచ్చాయి. వీరిది ప్రేమ పెళ్లా? లేక పెద్దలు నిశ్చయించిన పెళ్లా? అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. నిజానికి వీరి పెళ్లి ఎలా జరిగింది వీరి పెళ్లి జరగడానికి కారణం ఎవరు అనే విషయానికి వస్తే..

1988 జూన్ నెలలో సుహాసిని తండ్రి చారుహాసన్ కి వెన్ను సమస్యలు రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే సుహాసిని చూస్తూ ఆయన డిసెంబర్ లో ఏ విధమైనటువంటి సినిమాలను ఒప్పుకోకు అని చెప్పారు.తన తండ్రి అలా ఎందుకు చెప్తున్నాడు అర్థం కాని సుహాసినికి తన తండ్రి అసలు విషయం చెప్పాడు.బయట నీ గురించి దర్శకుడు మణిరత్నం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఒకసారి వెళ్లి అతనిని కలువు అంటూ సమాధానం చెప్పాడు.

తన తండ్రి అలా చెప్పగానే సుహాసిని మొహంలో ఆనందం, ఆశ్చర్యం రెండు వ్యక్తమయ్యాయి. అయితే తానెప్పుడు మణిరత్నం గారితో మాట్లాడకపోయినా అతనంటే సుహాసిని ఒక రకమైన గౌరవం ఉండేది. ఈ క్రమంలోనే అతనితో తన తండ్రి మాట్లాడమని చెప్పినప్పుడు ఎంతో ఆనంద పడింది. ఈ క్రమంలోనే అతనితో ఎలా మాట్లాడాలి అని తన స్నేహితురాలు సలహామేరకు ఫోన్ చేసి మణిరత్నం గారితో మాట్లాడింది.

ఈ విధంగా మొదటి సారి వీరిద్దరూ కలుసుకుని ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు.ఈ క్రమంలోనే మణిరత్నం మరోసారి కలుద్దాం అంటూ వెళ్ళాడు. ఆ తర్వాత మరోసారి కలుసుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ విషయాన్ని దాదాపు ఒక వారం రోజుల వరకు ఎవరికీ చెప్పకుండా ఉన్నారు. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు పెళ్లి గురించి మాటలు రావడంతో వీరి పెళ్లి నిశ్చయమైంది.

ఈ విధంగా సుహాసిని మణిరత్నం మధ్య ఏదో జరుగుతుందని బయట వచ్చిన వార్తలే వారి పెళ్లికి పునాదులు వేశాయి. ఈ విధంగా పెద్దల సమక్షంలో 1988 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. వీరికి నందన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago