Tollywood Heroes Daughters: ఈ టాలీవుడ్ హీరోల కూతుర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలుసా?
Tollywood Heroes Daughters: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారసత్వాలు కొనసాగడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే ఒక హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అంటే అనంతరం వారి పిల్లలు కూడా అదే వారసత్వంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల కొడుకులు కూతుర్లు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా స్థిరపడ్డారు. అలాగే మరికొందరు హీరోలు మాత్రం తమ కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. మరి ఆ హీరోలు ఎవరు వారి కూతుర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయానికి వస్తే..
హీరో శ్రీకాంత్ వారసుడిగా ఇప్పటికే రోషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే శ్రీకాంత్ కూతురు మేధా తిరుపతిలో సందడి చేయగా శ్రీకాంత్ కూతురు ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈమె డిగ్రీ చదువుతోంది తనకు సినిమాలలోకి రావాలనే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదని అందుకే చదువుపై దృష్టి పెట్టి పై చదువులు చదువుతుందని తెలుస్తుంది.
మాస్ మహారాజ రవితేజ కుమారుడు ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్ర ద్వారా మెప్పించారు. ఇకపోతే రవితేజ కూతురు మోక్ష భూపతి రాజు మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈమె ఫారెన్ లో డిగ్రీ చదువుతున్నారు.
ఇక సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న దగ్గుబాటి కుటుంబం నుంచి వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఇండస్ట్రీలోకి రాలేదు. ఇప్పటికే పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం చేసుకొని ఫారెన్ లో సెటిల్ కాగా రెండవ కుమార్తె హయ వాహిని సైతం పై చదువులు నిమిత్తం ఫారిన్లో ఉన్నారు. ఇక మూడవ కుమార్తె భావన కూడా ఉన్నత చదువులపై దృష్టి సారించారు.
హీరోగా విలన్ గా అందరిని మెప్పించిన నటుడు జగపతిబాబుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు పెళ్లి చేసే అమెరికా పంపించగా రెండవ కుమార్తె కూడా ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళ్లారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి. వీటిలో పెద్ద కుమార్తె సాయి ప్రసీద ఇప్పటికే తన చదువులు పూర్తిచేసే బిజినెస్ వైపు అడుగులు వేశారు. ఇక ఈమె తన అన్నయ్య ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. మిగిలిన ఇద్దరు కూడా పై వారి చదువులను కొనసాగిస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…