బుల్లితెరపై ఓంకార్ ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఓంకార్ సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన గుర్తింపు ఓంకార్ కి ఉంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఆట అనే కార్యక్రమాన్ని కూడా ఓంకార్ చేసేవారు.ఆట కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఈ క్రమంలోనే ఆట కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి కొరియోగ్రాఫర్ భరత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భరత్ చూడటానికి కొద్దిగా లావుగా ఉన్నప్పటికీ ఎంతో అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేవారు. ఆట కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న భరత్ తనకు మంచి భవిష్యత్తు ఏర్పడేలోగా ఈ లోకం వదిలి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
అప్పుడప్పుడే కెరీర్ గాడిలో పడుతున్న క్రమంలో భరత్ 2015 వ సంవత్సరంలో హైదరాబాదులోని మోతీ నగర్ లో తన సొంత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే భరత్ చనిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు తెలియకపోయినప్పటికీ భరత్ మృతి మాత్రం అందరినీ కృంగ తీసిందని చెప్పవచ్చు.
భరత్ ఈ విధంగా చనిపోవడానికి గల కారణం ఆర్థిక ఇబ్బందులేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో ఎంతో మానసికంగా క్రుంగిపోయిన భరత్ ఈ విధమైనటువంటి దారుణానికి పాల్పడ్డారని తెలుస్తుంది. 2015 సంవత్సరంలో నిశ్చితార్థం జరుపుకున్న భరత్ 2016 ఫిబ్రవరిలో పెళ్లి కూడా నిర్ణయించారు.ఈ క్రమంలోనే భరత్ చనిపోయేముందు తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె రెస్పాండ్ కాలేదు. ఈ క్రమంలోనే భరత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…