చలి కాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా గజగజా వణకాల్సిందే. సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో ఎక్కువగా మంచు కురవడంతో పాటు విపరీతమైన చలి ఉంటుంది. భారత వాతావరణ శాఖ సైతం శీతాకాలం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తోంది. అయితే 20 డిగ్రీల ఉష్ణోగ్రతకే మనం చలికి గజగజా వణికిపోతాం.
ఒకవేళ ఆ ఉష్ణోగ్రత -71 డిగ్రీలుగా ఉంటే ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే అలాంటి వాతావరణం ఉన్న గ్రామం ఉండటంతో పాటు ఆ గ్రామంలో 800 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. రష్యా దేశంలోని సైబీరియాకు దగ్గరలో ఒమ్యకోన్ అనే గ్రామం ప్రపంచంలోనే అతి శీతల గ్రామంగా పేరు తెచ్చుకుంది. 1924 సంవత్సరంలో ఇక్కడ -71.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ గ్రామంలో మంచు లేదా మంచుతుఫాను నిరంతరం పడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో నవంబర్ నెల నుంచి వచ్చే జనవరి వరకు అతి శీతల పరిస్థితులు ఉంటాయి. చలికాలంలో ఇక్కడ సూర్యుడు 10 గంటల సమయంలో ఉదయిస్తాడంటే ఈ గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో సులభంగానే అర్థమవుతుంది. ఈ గ్రామంలో రైతులు పంటలు కూడా పండించలేరు.
రిన్డీర్, హార్స్ మాస్, మాంసం చేపలను తిని ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తారు. 50 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు తగ్గితే ఈ గ్రామంలో పాఠశాలలు మూసివేశారు. ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఈ గ్రామం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…