Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని దాదాపు 1569 ఎపిసోడ్లు పాటు ప్రసారమైనటువంటి ఈ సీరియల్ మంచి ఆదరణ పొందడంతో ఈ సీరియల్ కి సీక్వెల్ తీసుకువస్తున్నారు.
కార్తీకదీపం 2 ద్వారా నేటినుంచి ఈ సీరియల్ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తండేల్ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలకు సంబంధించినటువంటి రీల్ వీడియోని నాగచైతన్య వాలంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇందులో భాగంగా నాగచైతన్య బుజ్జితల్లే.. వచ్చేత్తున్న కదే, కాస్త నవ్వవే` అని ప్రేమగా పిలుస్తాడు చైతూ.దీనికి సాయిపల్లవి కూడా అంతా బాగా రియాక్ట్ అవుతుంది. మొదట్లో బాధలో నుంచి ఆమె నవ్విన తీరు ఆకట్టుకోవడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ రీల్ ను డాక్టర్ బాబు వంటలక్క ఇద్దరు చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సీరియల్ కి సీక్వెల్..
ఇక ఈ సీరియల్ నేటి నుంచి ప్రసారం కాబోతుంది ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు కార్తీకదీపం 2 ఇది నవ వసంతం అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాలకు సీక్వెల్స్ రావడం చూసాము కానీ సీరియల్స్ కు సీక్వెల్ రావడం ఇది మొదటి సారి అని చెప్పాలి. ఇలా సీరియల్ కి సీక్వెల్ వస్తుంది అంటే ఈ సీరియల్ కి ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…