రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో డ్రోన్ చలనం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో జైలు పైభాగంలో డ్రోన్లు ఎగురుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై జైలు అధికారులు నిన్న రాత్రి ఎస్పీ నరసింహ కిషోర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.
ప్రాథమిక దర్యాప్తులో, సమీపంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి డ్రోన్లు ఎగురుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ప్రాధాన్యం పెరగడానికి కారణం, ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటమే. దీనితో, తమ నేతపై ఎవరైనా రెక్కీ నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం పోలీసులు డ్రోన్ ఎగరేసింది ఎవరు? దాని ఉద్దేశ్యం ఏమిటి? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిజనిజాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…