Dulquer Salmaan:మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈయన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినా అనంతరం ఈయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటులకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా పెరిగిపోయారు. ఈ క్రమంలోనే తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దుల్కర్
తెలుగులో మరొక అవకాశాన్ని అందుకున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు పూర్తి అయ్యాయని త్వరలోనే అధికారక ప్రకటన రానుందని సమాచారం.
దుల్కర్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా ధనుష్ హీరోగా సార్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి తన తదుపరి ప్రాజెక్టు గురించి దుల్కర్ సల్మాన్ ను కలిసి కథ వినిపించగా కథ నచ్చడంతో దుల్కర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇలా దుల్కర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాని బడా బ్యానర్ నిర్మించబోతుందని సమాచారం.ఇక ఈ కాంబినేషన్లో రాబోతున్న సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారట. త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటన తెలియజేయబోతున్నారు.ప్రస్తుతం మలయాళంలో సొంత నిర్మాణంలో దుల్కర్ ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల అనంతరం తిరిగి వెంకీ అట్లూరి సినిమాలో బిజీ కానున్నట్లు తెలుస్తుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…