Featured

Eluru Incident : ఏ కన్న తల్లీ చేయని పని చేసిన మహిళ… రెండో భర్త దగ్గరికి తన కూతుర్లను పంపి…!

Eluru Incident : మానవజాతి సిగ్గుపడేలా ఏ కన్న తల్లీ చేయకూడని పని ఏలూరులో జరిగింది. కన్నతల్లి అంటే పిల్లలను సంరక్షించుకోవడం కోసం తన ప్రాణాలను సైతం అడ్డుగా పెట్టి పోరాడుతుంది. అలాంటి తల్లి స్థానంలో ఉన్న ఒక మహిళ తన కన్న బిడ్డల్నే భర్త దగ్గరికి పంపింది. భర్తతో కాపురం చేయించి పిల్లల్ని కూడా కనేలా చేసింది. మొత్తం సమాజం సిగ్గుపడేలాంటి ఈ సంఘటన ఏలూరులో జరిగినది.

కూతుర్లతో బిడ్డలను కన్న వరుసకూ తండ్రి అయ్యే వ్యక్తి…

ఏలూరులోని పెదపాడు మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ భర్త 2007లో మరణించడంతో బావ వరుస అయ్యే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మగ బిడ్డను కనాలని లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని భర్త సతీష్ కుమార్ బెదిరించదంతో అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళ వయసుకు వచ్చిన తన కూతుర్ల ద్వారా పిల్లల్ని కనమని తన భర్త సతీష్ వద్దకు పెద్ద కూతురుని పంపింది. ఆ అమ్మాయికి పాప పుట్టగా రెండో అమ్మాయిని పంపింది. ఆ అమ్మాయికి బాబు పుట్టాడు. అయితే పుట్టిన బిడ్డ మరణించడంతో ఆ శిశువును మురికి కాలువలోకి పడేసారు. ఆడపిల్లను తమ బిడ్డగా బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు.

అయితే సతీష్ కి ఆ మహిళకు విబేధాలు రావడంతో సదరు మహిళ కూతుర్లను అక్కడే వదిలి పుట్టింటికి వైజాగ్ వెళ్ళింది. ఇక తెలిసిన వ్యక్తికి చిన్న కూతురు విషయం చెప్పగా బంధువుల సహాయంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు మైనర్ బాలికలు సంరక్షణ కేంద్రంలో ఉండగా ఇద్దరూ గర్భవతులు. ఇలా సభ్య సమాజం తలదించుకునేలా చేసిన సతీష్ అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago