పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. కానీ పెళ్ళిలో ముఖ్యమైన శారీరక బంధం, భూమిపైనే సాధ్యం.. లైంగిక బంధం సరిగాలేని జంటల్లోని మగవారు లేదా ఆడవాళ్లు తోడును వదిలి వేరొకరితో అక్రమ సంబంధాలను కొనసాగిస్తుంటారు. కానీ ఇలా డబ్బు కోసం కూడా పరాయి వాళ్ల మోజులో పడి వెళ్తుంటారు. ఇలా వెల్లి తనను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచుతారు. ఇలాంటి ఘటనలకు పాల్పడి జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.
అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో చోటుచేసుకుంది. పక్కింటి మహిళ మోజులో పడిపోయి తన భార్యను, పిల్లలను పట్టించుకోకుండా తనకున్న ఆస్తులను అమ్మి.. అతడు మోజుపడ్డ మహిళకు ఇచ్చేశాడు. ఇంట్లో భార్య, పిల్లలు ఎంత చెప్పినా వినలేదు. దీంతో ఓ రోజు అతడిని కుటుంబసభ్యులే చంపేశారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా అచాపుర గ్రామానికి చెందిన వినోద్, బిను భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు.
ఇలా హాయిగా సాగుతున్న వీరి కాపురంలో ఓ మహిళ అతడికి పరిచయం కావడం పెద్ద చిచ్చు పెట్టినట్లు అయింది. ఆమెతో పరిచయం.. కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అంతేకాదు తన ఆస్తులను అమ్మిమరి సదరు మహిళకు డబ్బులివ్వడం ప్రారంభించాడు. ఈ విషయం గురించి వాళ్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఎంత చెప్పినా వినోద్ లో మార్పు రావడంలేదని ఆమె తన ఇద్దరు కొడుకులు, మరో ఇద్దరి బంధువులతో కలిసి వినోద్ హత్యకు భార్య ప్రణాళికలు రచించింది.
అతడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ ఇనుపతీగను తీసుకొని గొంతకు బిగించి అటు ఇద్దరు.. ఇటు ఇద్దరు పట్టుకొని గట్టిగా లాగారు. దీంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. ఇక ఆ శవాన్ని కారులో తీసుకెళ్లి అడవిలో కారుతో సహా తగల బెట్టారు. తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసులకు అనుమానం రావడంతో మొత్తం బయటకు వచ్చింది. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…