Fatal road accident on the express highway.. 20 vehicles collided!
మహారాష్ట్ర, పుణే జిల్లా: మహారాష్ట్రలోని పుణే జిల్లా వద్ద ముంబై-పుణే ఎక్స్ప్రెస్వేపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ ఎంట్రీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 16 మంది వరకు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే, లోనావాలా-ఖండాల ఘాట్ వద్ద ఓ కంటైనర్ వాహనానికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. నియంత్రణ తప్పిన ఆ భారీ వాహనం ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో ఆ వెంటనే వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. పలు కార్లు, వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన కారణంగా ఎక్స్ప్రెస్వేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ధ్వంసమైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ప్రయాణికులు ఇలాంటి ఘటనలు రీపీట్ కాకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…