Featured

Fight Masters Ram Lakshman : చిరంజీవి, బాలయ్య షాట్ కట్ అనగానే క్యారవాన్ లోకి వెళ్లరు.. అందుకే ఇప్పటికీ సినీ పరిశ్రమకు రెండు పిల్లర్స్ గా ఉన్నారు. : రామ్ లక్ష్మణ్.

Fight Masters Ram Lakshman : ఇప్పుడే కాదు సంక్రాంతి పండగకు ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి, బాలయ్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూనే ఉన్నారు. సంక్రాంతి బరిలో ఆ ఇద్దరిలో ఎవరు నెగ్గారు. ఎవరు తగ్గారు అనేది వేరే అంశం. వీరి సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయంటే తెలుగు ప్రేక్షకుల హంగామా అంతా ఇంతా కాదు… అయితే ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా చిరంజీవి, వీర సింహారెడ్డిగా బాలయ్య అభిమానులను అలరించడానికి షూటింగ్ పూర్తిచేసుకుని సంసిద్ధంగా ఉన్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విడుదలబోతున్న ఈ రెండు చిత్రాలకు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా చేస్తున్నారు. అయితే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…

తాము సినీ పరిశ్రమకు వచ్చి చాలా సంవత్సరాలవుతుందని.. ఆ కళామతల్లి ఆదరించడం వలన ఈ పరిశ్రమలో కొనసాగుతున్నామని ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాం. అలాగే దర్శక నిర్మాతలు మా ప్రతిభను గుర్తించి మాకు అవకాశాలు ఇస్తున్నారు. యాంకర్ సంక్రాంతికి విడుదల అవబోతున్న వాల్తేరువీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాల గురించి ప్రస్తావించినప్పుడు… ఆరుపదుల వయసు దాటిన చిరంజీవి, బాలయ్య ఇంకా ఎనర్జిటిక్ గా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని. అయితే వారిద్దరికి సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్, డెడికేషన్ ఒకేలాగా ఉంటుందని..

వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఫైటింగ్ చేస్తున్నప్పుడు చివరిగా.. అన్నయ్య చిరంజీవి వస్తారు. అయితే ముందుగా ఆయనను రమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని షూటింగ్ కి టు అవర్స్ లేటుగా రమ్మన్నాం. కానీ అన్నయ్య చిరంజీవి తన కోసం ఎదురుచూడడం ఎందుకని వన్ అవర్ ముందుగానే లొకేషన్ కు వచ్చారు. అన్నయ్య చిరంజీవి షాట్ రెడీ అనగానే వచ్చి ఫైట్ సీన్స్ లో పాల్గొనడం జరిగింది. షాట్ కట్ అయిన తర్వాత కూడా లొకేషన్ లో ఉంటూ తదుపరి జరగబోయే సీన్స్ లో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే బాలయ్య కూడా అంతే వర్క్ పట్ల అంతే కమిట్మెంట్ తో పనిచేస్తారు. షాట్ కట్ అన్న తర్వాత కూడా వారికి కేటాయించిన క్యారవాన్ లోకి వెళ్లకుండా అందరితో కలిసి సినిమా సెట్ లోనే ఉంటారు.

అన్నయ్య చిరంజీవి, బాలయ్యబాబు ఇద్దరు కూడా లంచ్ వరకు సెట్ లోనే ఉంటూ లంచ్ సమయంలో మాత్రం కారవాన్ లోకి వెళ్తారు. కానీ ఇప్పుడు వస్తున్న నటీనటులు షాట్ కట్ అనగానే కారవాన్ లో వెళ్లి కూర్చుంటున్నారు. చిరంజీవి, బాలయ్య ఆ పద్ధతులు పాటించడం వల్లనే వారు ఇప్పటికీ సినీ పరిశ్రమలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అందుకే తెలుగు ప్రజలు వారిని ఇంకా అభిమానిస్తూనే ఉన్నారంటూ.. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రేమించి పెళ్లి… చివరకు భర్త హత్య! హోలోగ్రామ్‌తో బయటపడిన షాకింగ్ కుట్ర

ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…

7 minutes ago

అషు రెడ్డి-టెక్కీ వివాదంలో ఆడియో బాంబ్

బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…

10 minutes ago

ఒక్క ఛాన్స్ కోసం తిరిగిన సత్యరాజ్.. కట్టప్పగా వరల్డ్ ఫేమ్

దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…

13 minutes ago

“ఆ హీరో నా జీవితంలో గాడ్ ఫాదర్”.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…

19 minutes ago

“వినాశకాలే విపరీత బుద్ధి”.. యువతకు కఠిన హెచ్చరిక

ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…

56 minutes ago

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

2 hours ago