ఏపీ, నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. గురువారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం. ఈ ఘటనలో తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి (45), అతని భార్య దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మిద్దె కూలి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గ్రామస్థులకు సూచించారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…