సాధారణంగా మనకు ఎవరైనా అప్పు చెల్లించాలి అంటే వారికి కొద్ది రోజులు గడువు ఇస్తాము. అయినా చెల్లించకపోతే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చేస్తాం.కానీ ఇక్కడ దుండగలు మాత్రం తమకు అప్పు చెల్లించలేదని ఒక రెస్టారెంట్ పై దాడి చేసిన సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు. హోటల్ యాజమాన్యం అప్పు చెల్లించలేదని కోపంతో హోటల్ మొత్తం వేలాది బొద్దింకలను వదిలిన వెళ్లిన ఘటన తైవాన్లోని తైపీలో గల జి-హౌస్ రెస్టారెంట్లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే హోటల్ యజమాని హోటల్ నిర్మాణ సమయంలో కొంత అప్పుగా ఇతరుల నుంచి తీసుకున్నారు. అయితే తన అప్పు చెల్లించలేదని కోపంతో ఇద్దరు వ్యక్తులు సాధారణ కస్టమర్ లాగా హోటల్ లోకి వచ్చారు. అయితే తమతో పాటు సంచులలో వేలాది బొద్దింకలను తీసుకువచ్చి ఆ రెస్టారెంట్ లో వదిలి పారిపోయారు. దీంతో హోటల్ మొత్తం బొద్దింకలు పాకాయి.అప్పు చెల్లించలేదని నిందితులు ఈ విధంగా రివేంజ్ తీర్చుకున్నారు.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తైపీ పోలీస్ కమిషనర్ చెన్ జీయా చాంగ్ విలేకరులతో మాట్లాడుతూ కేవలం అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతోనే ఈ విధమైనటువంటి పాడు పనికి పాల్పడినట్లు తెలిపారు. ప్రజలు ఆహారాన్ని తీసుకొనే రెస్టారెంటులోకి వ్యాధులు కలిగించే బొద్దింకలను వదలడం నేరమే. నిందితులను తప్పకుండా శిక్షిస్తాం అని తెలిపారు. రెస్టారెంట్ యాజమాన్యం ఈ విషయంపై స్పందిస్తూ వారు ఎవరో తమకు తెలియదని, రెస్టారెంట్ మొత్తం రసాయనాలతో శుద్ధి చేసిన తర్వాతనే ఓపెన్ చేస్తామని తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…