గ్యాస్ కంపెనీలు రెండు రోజుల క్రితం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తూ గ్యాస్ సిలిండర్ కంపెనీలు కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ అమెజాన్ పే ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
అమెజాన్ లో పే బిల్స్ అనే ఆప్షన్ ను ఎంచుకుని గ్యాస్ సిలిండర్ ను బుల్ చేసుకుంటే 50 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఎల్పీజీ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే అందరూ ఈ ఆఫర్ ను పొందలేరు. తొలిసారి అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందగలుగుతారు.
ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థలలో ఒకటైన పేటీఎం సైతం కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే ఏకంగా 500 రూపాయలు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. పేటీఎం యాప్ ను ఓపెన్ చేసి రీచార్జ్ అండ్ పే బిల్స్ ఆప్షన్ ను ఎంచుకుని గ్యాస్ సిలిండర్ ను సులువుగా బుక్ చేసుకోవచ్చు.
పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారు “firstlpg” అనే ప్రోమో కోడ్ ను వాడితే మాత్రమే ఈ ఆఫర్ ను పొందడానికి అర్హులవుతారు. ప్రోమో కోడ్ ను వాడకపోతే ఈ ఆఫర్ ను పొందడం సాధ్యం కాదు. ఈ నెల చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…