రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరటనిచ్చినప్పటికీ, శుక్రవారం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి నుంచి బంగారం మళ్లీ పరుగులు తీస్తూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తోంది. ఒక్క శుక్రవారం రోజే తులం బంగారంపై ఏకంగా రూ.5,000 వరకు పెరుగుదల నమోదు కాగా, ఇవాళ కూడా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
శనివారం ఉదయం కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే బంగారం ధరపై రూ.1,470 పెరిగింది. హైదరాబాద్లో ఉదయం 6 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,160గా ఉండగా, ఉదయం 10 గంటలకు అది రూ.1,58,620కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.1,44,060గా ఉండగా, కొన్ని గంటల్లోనే రూ.1,45,400కు పెరిగింది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. ముంబై, కేరళ, కోల్కతా, పుణే, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,400 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,770గా ఉండగా, చెన్నైలో ఇది రూ.1,59,490గా నమోదైంది.
ఇక వెండి విషయానికి వస్తే బంగారాన్ని మించి వేగంగా దూసుకెళ్లింది. శుక్రవారం ఒక్కరోజే కేజీ వెండి ధరపై రూ.20,000కు పైగా పెరుగుదల నమోదైంది. అయితే ఇవాళ ఆ వేగం కొద్దిగా తగ్గింది. శనివారం కేజీ వెండి ధరపై కేవలం రూ.100 మాత్రమే పెరిగింది.
భారీ హెచ్చుతగ్గుల అనంతరం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.5,000 తగ్గి రూ.3,45,000కు చేరగా, హైదరాబాద్లో మాత్రం వెండి ధర కేజీకి రూ.3,60,100గా కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకం విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం – వెండి ధరల్లో ఇలాంటి తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు దారులు, పెట్టుబడిదారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…