General News

ఒక్క రూపాయికే బంగారం.. ఇంటికి డెలివరీ పొందే అవకాశం..!

20 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయలు కాగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా పలుకుతోంది. రోజురోజుకు బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనే కంటే అమ్మడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. మిగతా వాటితో పోలిస్తే బంగారం ధర శరవేగంగా పెరుగుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలో బంగారం ధర రెండు రెట్లు పెరిగిందని చెబుతున్నారు.

అయితే తక్కువ మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని భారత్ పే కల్పిస్తోంది. ఒక్క రూపాయి నుంచి ఎంత మొత్తానికైనా డిజిటల్ గోల్డ్ ను సులభంగా కొనుగోలు చేసే అవకాశాన్ని భారత్ పే కల్పిస్తోంది. మర్చంట్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ అయిన భారత్ పే సేఫ్ గోల్డ్ తో ఒప్పందం కుదుర్చుకుని తన మర్చంట్లకు డిజిటల్ గోల్డ్ కొనే సదుపాయంతో పాటు అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది.

భారత్ పే మర్చంట్లు 24 క్యారెట్ల బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. భవిష్యత్తులో భారత్ పే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్ సర్వీసెస్ ద్వారా దీపావళి పండుగ నాటికి 6 కేజీల బంగారాన్ని అమ్మాలని భారత్ పే టార్గెట్ గా పెట్టుకుంది. చాలామంది మర్చంట్ల కోరిక మేరకు డిజిటల్ గోల్డ్ సర్వీస్ లను ప్రారంభించామని తెలిపింది,

బంగారం కొనుగోలు చేసిన వాళ్లకు జీఎస్‌టీ ఇన్‌పుట్‌ను క్రెడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా భారత్ పే కల్పిస్తోంది. అవసరం అనుకున్న వాళ్లు డిజిటల్ గోల్డ్ మొత్తంతో ఫిజికల్ గోల్డ్ ను కొనుగోలు చేసే అవకాశం భారత్ పే కల్పిస్తోంది. భారత్ పే ప్రెసిడెంట్ సుహైల్ సమీర్ ఈ విషయాలను వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

2 minutes ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

4 minutes ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

24 minutes ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

27 minutes ago

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. వైద్య రంగంలో సంచలనం!

ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…

34 minutes ago

పరగడుపున పండ్లు తినొచ్చా? నిపుణుల స్పష్టమైన సమాధానం!

ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…

1 hour ago