Free Ration: ఏపీ ప్రజలకు శుభవార్త..! రేషన్ కార్డుదారులకు ముఖ్య సూచన..!
Free Ration: కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులకు గురైన ప్రజలను ఆహార భద్రత విషయంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన అనే పథకం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాంగంగానే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ వస్తోంది.
ఈ పథకం గత సంవత్సరం నవంబర్ లోనే ముగించాల్సి ఉండగా.. దానిని మరో ఐదు నెలలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే ఈ సంవత్సరం మార్చి 31 వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు.
దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా మరో శుభవార్తను అందించింది. జనవరి 18 నుంచి ప్రజలందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయనునట్లు పేర్కొంది.
సాధారణంగా జవనరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉచిత రేషన్ బియ్యం సరఫరా జరగాలి. కానీ బియ్యం నిల్వలు లేనందును డిసెంబర్ నెలలో పంపిణీ చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు తాజాగా ఈ ప్రకటన చేసింది. డిసెంబర్, జనవరి నెలలకు సరిపడా.. ఒకొక్కరికీ 10 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత బియ్యం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గిరాజా శంకర్ సూచనలు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఒకొక్కరికీ 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికర సంఘటనలు కాలానుగుణంగా మళ్లీ వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన విషయం తాజాగా…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన సుస్వాగతం సినిమా వెనుక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా…
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న ఆందోళన మధ్య, పాలు కూడా భద్రత పరంగా చర్చకు వస్తున్నాయి. పిల్లల నుంచి…
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో…
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…
అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…