Free Ration: ఏపీ ప్రజలకు శుభవార్త..! రేషన్ కార్డుదారులకు ముఖ్య సూచన..!
Free Ration: కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులకు గురైన ప్రజలను ఆహార భద్రత విషయంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన అనే పథకం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాంగంగానే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ వస్తోంది.
ఈ పథకం గత సంవత్సరం నవంబర్ లోనే ముగించాల్సి ఉండగా.. దానిని మరో ఐదు నెలలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే ఈ సంవత్సరం మార్చి 31 వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు.
దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా మరో శుభవార్తను అందించింది. జనవరి 18 నుంచి ప్రజలందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయనునట్లు పేర్కొంది.
సాధారణంగా జవనరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉచిత రేషన్ బియ్యం సరఫరా జరగాలి. కానీ బియ్యం నిల్వలు లేనందును డిసెంబర్ నెలలో పంపిణీ చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు తాజాగా ఈ ప్రకటన చేసింది. డిసెంబర్, జనవరి నెలలకు సరిపడా.. ఒకొక్కరికీ 10 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత బియ్యం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గిరాజా శంకర్ సూచనలు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఒకొక్కరికీ 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…