India High Resolution Unemployment Concept
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైంది. కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టాల పాలైన ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేశాయి. అయితే కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయిన వారికి కేంద్రం కొన్ని రోజుల క్రితం తీపికబురు చెప్పింది. అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంలో నియమ నిబంధనల్లో కీలక మార్పులు చేసి ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రయోజనం చేకూరేలా చేసింది.
అయితే కేంద్రం ఉద్యోగం కోల్పోయిన వారి కోసం మరో ఆరు నెలల పాటు ఈ పథకానికి గడువు పొడిగించింది. ఈ.ఎస్.ఐ,సీ ఉద్యోగం కోల్పోయిన వారికి 90 రోజుల వేతనంలో 25 శాతం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తోంది. గతంలో 25 శాతంగా ఉండగా కేంద్రం కరోనా, లాక్ డౌన్ వల్ల 50 శాతం వేతనాన్ని పెంచింది. ఉద్యోగులు ఈ స్కీమ్ ద్వారా సులువుగా 50 శాతం వేతనాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఉద్యోగులు ఎవరైనా ఉద్యోగాన్ని కోల్పోతే 30 రోజుల తరువాత ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. గతంలో ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయిన మూడు నెలల తరువాత ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసే అవకాశం ఉండగా కేంద్రం ఆ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. గతంలో 2020 డిసెంబర్ 31 వరకు మారిన నిబంధనలు అమలవుతాయని చెప్పిన కేంద్రం ప్రస్తుతం 2021 జూన్ 30 వరకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది.
2018 సంవత్సరం జులై నెలలో ఈ పథకం ప్రారంభమైంది. అయితే ఉద్యోగి తన జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందే విధంగా ఈ స్కీమ్ నిబంధనలు ఉన్నాయి. https://www.esic.nic.in/ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…