ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. భారీ వర్షాల వల్ల పంట దెబ్బ తినడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం ప్రభుత్వం 10.76 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2020 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల మధ్యలో కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఆ సమయంలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదలైంది. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ నగదును ఇవ్వనుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నష్టపోయిన రైతుల వివరాలను, వారికి అందించాల్సిన పరిహారం వివరాలకు సంబంధించిన నివేదికను తయారు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో 7,757 హెక్టార్లల్లో పంట నష్టానికి సబ్సిడీ విడుదలైంది.
ప్రభుత్వం విడుదల చేసిన నగదును 17,872 మంది నష్టపోయిన రైతులకు అధికారులు ఇవ్వనున్నారు. మరోవైపు జగన్ సర్కార్ ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా నగదును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రైతుల ఖాతాలలో 4,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుందని తెలుస్తోంది. ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఈ నగదును రైతులకు ఇస్తోంది.
జగన్ సర్కార్ ప్రతి సంత్సరం రైతు భరోసా పథకం ద్వారా 13,500 రూపాయల నగదు ఇవ్వనుండగా ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు, రాష్ట్రం వాటా 7,500 రూపాయలుగా ఉంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాలు ఉన్నా పథకాలను అమలు చేస్తూ ఉండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…