Featured

బీటెక్ స్టూడెంట్ హత్య కేసులో మరో మలుపు.. విచారణలో సంచలన విషయాలు..!

బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సీసీటీవీ ఫుటేజీ లో రమ్యను హత్య చేసే వీడియో ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా ఆ నిందితుడు ఆమెను చంపేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు రోజు అతడు రెక్కీ నిర్వహించి.. పకడ్బందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. విచారణలో పోలీసులు అతడిని ఆ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఏ విధంగా అమలు చేశాడు అనేదానిపై ప్రశ్నించగా కీలక అంశాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. రమ్య అతడికి 2021, జనవరిలో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైందని.. తర్వాత ఇష్టాఇష్టాలు పంచుకున్నారు.

కొన్నిరోజుల తర్వాత ఆమెకు అతడు ప్రపోజ్ చేశాడు. తనను ప్రేమించాలని కోరినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. దీంతో రమ్య అతడి ప్రపోజల్ తిరస్కరించింది. నిందితుడు శశికృష్ణ వేధింపులు ఎక్కువకావడంతో అతడి ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఫోన్ నంబర్లను కూడా ఆమె బ్లాక్ చేసింది. దీంతో శశికృష్ణ.. రమ్య స్వగ్రామానికి వెళ్లి మరీ ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు.

హత్యకు పన్నాంగం ఎలా పన్నాడంటే.. తనను ప్రేమించకపోవడంతో శశికృష్ణ ఆమెపై కక్ష కట్టాడు. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. రమ్య కాలేజీకి వస్తుందా.. రావడం లేదా అనేది తెలుసుకున్నాడు. ఈ నెల 14న బుడంపాడులో రెక్కీ నిర్వహించి.. తన ఫ్రెండ్ తో కలిసి బైక్ పై కాలేజీ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమె శశికృష్ణను చూసి కాలేజీలోకి పరుగు పెట్టింది. ఆ రోజే అతడు సాయంత్రం మరోసారి కాలేజీకి వెళ్లాడు. ఐతే అప్పటికే రమ్య ఇంటికి వెళ్లిపోవడంతో తన ఫ్రెండ్ దగ్గర కత్తితీసుకోని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ రాత్రంతా ఆమెను చంపాలనే ఆలోచనతోనే ఉన్నాడు.

మరునాడు ఉదయం కాకాని రోడ్డులో రమ్య కోసం మాటు వేశాడు. అదే సమయంలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన రమ్యతో వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేమించమంటూ.. ఇబ్బంది పెట్టాడు. ఆమె ఫోన్ కూడా లాక్కున్నాడు. టిఫిన్ ఇంట్లో ఇచ్చి ఫోన్ కోసం వచ్చిన రమ్యను బైక్ ఎక్కాలని బలవంతం చేశాడు. ఈ సమయంలోనే అతడి దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని ఇంటికి వెళ్తున్న రమ్యను అడ్డగించి కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య చేసిన వెంటనే నిందితుడు అక్కడ నుంచి పారిపోయి పొలాల్లో దాక్కున్నాడు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను కూడా అతడు బెదిరించాడు. దగ్గరకు వస్తే కత్తితో చేతిపై కోసుకుంటానని.. గాట్లు కూడా పెట్టుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని పట్టుకొని అరెస్టు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago