Featured

బీటెక్ స్టూడెంట్ హత్య కేసులో మరో మలుపు.. విచారణలో సంచలన విషయాలు..!

బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సీసీటీవీ ఫుటేజీ లో రమ్యను హత్య చేసే వీడియో ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా ఆ నిందితుడు ఆమెను చంపేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు రోజు అతడు రెక్కీ నిర్వహించి.. పకడ్బందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. విచారణలో పోలీసులు అతడిని ఆ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఏ విధంగా అమలు చేశాడు అనేదానిపై ప్రశ్నించగా కీలక అంశాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. రమ్య అతడికి 2021, జనవరిలో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైందని.. తర్వాత ఇష్టాఇష్టాలు పంచుకున్నారు.

కొన్నిరోజుల తర్వాత ఆమెకు అతడు ప్రపోజ్ చేశాడు. తనను ప్రేమించాలని కోరినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. దీంతో రమ్య అతడి ప్రపోజల్ తిరస్కరించింది. నిందితుడు శశికృష్ణ వేధింపులు ఎక్కువకావడంతో అతడి ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఫోన్ నంబర్లను కూడా ఆమె బ్లాక్ చేసింది. దీంతో శశికృష్ణ.. రమ్య స్వగ్రామానికి వెళ్లి మరీ ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు.

హత్యకు పన్నాంగం ఎలా పన్నాడంటే.. తనను ప్రేమించకపోవడంతో శశికృష్ణ ఆమెపై కక్ష కట్టాడు. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. రమ్య కాలేజీకి వస్తుందా.. రావడం లేదా అనేది తెలుసుకున్నాడు. ఈ నెల 14న బుడంపాడులో రెక్కీ నిర్వహించి.. తన ఫ్రెండ్ తో కలిసి బైక్ పై కాలేజీ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమె శశికృష్ణను చూసి కాలేజీలోకి పరుగు పెట్టింది. ఆ రోజే అతడు సాయంత్రం మరోసారి కాలేజీకి వెళ్లాడు. ఐతే అప్పటికే రమ్య ఇంటికి వెళ్లిపోవడంతో తన ఫ్రెండ్ దగ్గర కత్తితీసుకోని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ రాత్రంతా ఆమెను చంపాలనే ఆలోచనతోనే ఉన్నాడు.

మరునాడు ఉదయం కాకాని రోడ్డులో రమ్య కోసం మాటు వేశాడు. అదే సమయంలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన రమ్యతో వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేమించమంటూ.. ఇబ్బంది పెట్టాడు. ఆమె ఫోన్ కూడా లాక్కున్నాడు. టిఫిన్ ఇంట్లో ఇచ్చి ఫోన్ కోసం వచ్చిన రమ్యను బైక్ ఎక్కాలని బలవంతం చేశాడు. ఈ సమయంలోనే అతడి దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని ఇంటికి వెళ్తున్న రమ్యను అడ్డగించి కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య చేసిన వెంటనే నిందితుడు అక్కడ నుంచి పారిపోయి పొలాల్లో దాక్కున్నాడు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను కూడా అతడు బెదిరించాడు. దగ్గరకు వస్తే కత్తితో చేతిపై కోసుకుంటానని.. గాట్లు కూడా పెట్టుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని పట్టుకొని అరెస్టు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago