Movie News

నిత్యావసర ధరలు పెరుగుతున్నా పట్టించుకునేవారు లేరు కానీ… థియేటర్ల పై ఆంక్షలు విధిస్తారు: నాని

కరోనా కారణం వల్ల మూతబడిన థియేటర్లపై థియేటర్లలో పెట్టిన ఆంక్షల గురించి నటుడు నాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య ప్రజలపై అధిక భారంగా ఉన్నటువంటి నిత్యావసర ధరలు పెరుగుతున్నా, వాటికి పరిష్కార మార్గం ఆలోచించకుండా థియేటర్లపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారంటూ తాజాగా “తిమ్మరుసు”ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అది ఒక కల్చర్. ఒక వ్యక్తి ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు సినిమాను చూడగలిగేది అంటే థియేటర్లో మాత్రమేనని నాని తెలిపారు.సినిమా అంటే చాలామంది చిన్నచూపు చూడటం వల్లే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని నాని విమర్శించారు. సాధారణంగా రెస్టారెంట్ షాపింగ్ మాల్స్ తో పోలిస్తే థియేటర్లు ఎంతో సేఫ్ అని, కానీ కరోనా నిబంధనల పేరిట అన్నిటికంటే ముందుగా థియేటర్లను మూసేయమని అన్నిటికంటే చివరిగా థియేటర్లు తెరవడానికి అనుమతిస్తున్నారు అంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనదేశంలో సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లపై ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల ఎన్నో లక్షల మంది బతుకుల పై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని,పరిస్థితులు ఇలాగే కొనసాగితూ వెళ్తే థియేటర్ అనే ఒక వ్యవస్థ నాశనం అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ క్రమంలోనే సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “తిమ్మరుసు”చిత్రాన్ని ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను జూలై 26న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాచురల్ స్టార్ నాని పాల్గొని తనదైన శైలిలో తన భావాలను వ్యక్తపరిచారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న క్రైమ్, థ్రిల్లర్ చిత్రంలో సత్యదేవ్ సరసన
ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‏గా నటిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రేమకే రికార్డ్ సెట్ చేసిన లవర్..ఒక్క రోజుకు 25,000 రూపాయల ఆర్డర్లు!

ప్రేమికుల రోజు: గిఫ్ట్‌లు, కేకులు, ఆనందం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీ ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాలనూ ప్రేమికుల…

7 minutes ago

BIG BREAKING: తెలుగు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు – భద్రతా చర్యలు ముమ్మరం

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…

35 minutes ago

కేజీ వెండి ధర కుప్పకూలింది.. దేశవ్యాప్తంగా ఒకేసారి భారీ తగ్గుదల!

వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…

1 hour ago

హలీం.. రంజాన్ సీజన్‌లో ఆరోగ్య బోనస్! దీని ప్రయోజనాలు తెలుసుకున్నా వదలలేరు..

రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…

1 hour ago

ఇకపై రిస్క్‌ వద్దు.. ప్రభాస్ పెద్ద ప్రాజెక్ట్స్ విషయంలో కచ్చితమైన నిర్ణయం..!

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ కెరీర్ మరో మలుపు తిరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ…

2 hours ago

“అత్యాచారం తర్వాత హత్య… ఇప్పుడు నిందితుడి మృతి – అన్నమయ్య జిల్లాలో సంచలనం!”

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…

2 hours ago