Hero Sai Dharam Tej : మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ది డిఫరెంట్ స్టైల్ అనొచ్చు. మామ చిరంజీవి లాగానే వేసే డాన్సులో గ్రేస్ ఉంటుంది ఈ మెగా మేనల్లుడికి. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ సొంత గుర్తింపుతో దూసుకెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇంతలోనే ఎవరూ ఊహించని పరిణామం సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్, దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ హీరోగా మన ముందుకు వస్తాడా అని అందరూ అనుకున్నా చివరకు మళ్ళీ హీరోగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయి ధరమ్. తాజాగా తాను నటించిన ‘విరూపాక్ష’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సాయి తన మావయ్యల గురించి మాట్లాడారు.
చిరంజీవి మావయ్యకి కోపం వచ్చింది…
సాయి విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నప్పటి విశేషాలను, ముగ్గురు మావయ్యలతో ఉన్న అనుబంధాన్ని వివరించాడు. ఎపుడూ కోప్పడని చిరంజీవి గారు తనపై ఒకసారి కోప్పడ్డారని వివరించారు. చెన్నై లో చదివే సమయంలో ఎపుడూ క్లాస్ బయట నిలబెట్టే వారని, చదువు పెద్దగా రాకపోవడంతో ఇంటికి కంప్లెయింట్స్ వెళ్ళేవని, ప్రతిసారి అమ్మ వచ్చేది కాబట్టి పెద్దగా భయపడేవాడిని కాదు కానీ ఒకసారి మావయ్య షూటింగ్ కోసం చెన్నై వచ్చి ఇంటికి రావడం, అదే సమయంలో స్కూల్ నుండి ఫోన్ రావడంతో మావయ్య మాట్లాడారు.
స్కూల్ నుండి ఇంటికి వచ్చాక మావయ్య చూసినా చూపుకు బాగా భయం వేసింది. ఆరోజు చూసిన కోపం నేనెపుడు చూడలేదు అంటూ చెప్పారు. ఇక నాగబాబు మావయ్య ఎపుడూ నవ్విస్తూ నవ్వుతూ ఉంటారని కళ్యాణ్ మావయ్య కూడా బాగా నవ్విస్తారు, తాను అందరూ సీరియస్ గా ఉన్న సమయంలో జోక్స్ వేసి నవ్విస్తారు అంటూ చెప్పాడు సాయి. ఇక తనకు ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉన్న సమయంలో రిపబ్లిక్ సినిమా ప్రమోషన్స్ కోసం మొత్తం కుటుంబ సభ్యులందరూ వచ్చి సినిమా ప్రమోషన్స్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. చరణ్, బన్నీ, వరుణ్ నిహారిక ఇలా అందరూ నా సినిమా కోసం రావడం ఆనందాన్ని ఇచ్చినా ఆ దృశ్యం నేను చూడేలేదనే బాధ కూడా కొద్దిగా ఉంది అంటూ చెప్పాడు సాయి ధరమ్ తేజ్.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…