నటుడు శివాజీ సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.. ఆయనకు తెలుగు ప్రజలు అన్నా.. తెలుగు జాతి అన్నా ఎంతో అభిమానంతో తెలుగు ప్రజల మేలు కోసం పోరాటం చేయడానికి ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు.. పార్టీ లకు ఆతితంగా తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి శివాజీ.. ఆంధ్ర తెలంగాణ విడిపోయాక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగు ప్రజలు అందరు కోరడం జరిగింది.. ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చి 6 సంత్సరాలు దాటిన ఇప్పటికీ దాని గురించి ఆలోచించడం లేదు..
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారు.. శివాజీ కూడా ప్రత్యేక హోదా కోసం మోడీ గారితో కూడా చర్చలు జరిపి బీజేపీ పార్టీ లో చేరి ఆంధ్రరాష్ట్రం తరుపున పోరాడారు.. శివాజీ ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో నేను రాజకీయల్లోకి వచ్చిందే ఆంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడం కోసం అని స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చేవరకు పోరాడతానని, దాని కోసం చంద్రబాబు చేసిన ప్రత్యేక హోదా పోరాట దీక్షలో కూడా నిలబడతానని, అదే విధంగా ఇపుడు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన ఆయన తో కూడా కలిసి నడుస్తా అని చెప్పుకొచ్చారు.. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని దానికోసం మేము పార్టీలకు ఆతితాంగా కృషి చేస్తాను అని ఆయన చెప్పారు…
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…