Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహారిస్తూ సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
ఆమని భర్త ఎవరంటే… పిల్లలు ఏం చేస్తున్నారు…
హీరోయిన్ గా మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే అవకాశాలు బాగా వస్తున్న తరుణంలోనే 90లో పెళ్లి చేసుకున్న ఆమని ఆ తరువాత కెరీర్ లో వెనుక బడింది. ఇక సెంకండ్ ఇన్నింగ్స్ ఇపుడిపుడే మొదలు పెట్టి అదరగొడుతున్న ఆమనికి దైవ భక్తి ఎక్కువ. ఆమె వెంకటేశ్వరస్వామి భక్తురాలు. అలాంటి ఆమని ఒక ముస్లిమ్ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఖాజా మొహిద్ధున్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమని ఆమె లవ్ స్టోరీ గురించి వివరించారు.
తనకు అందరి దేవుళ్ళు ఒకటే అనే నమ్మకం ఉందని, అన్ని మతాలను గౌరవిస్తాను అంటూ తన భర్త సినిమా నిర్మాత అంటూ తెలిపారు. కన్నడ సినిమా చేసే సమయంలో తాను చేసిన సినిమాకు నిర్మాతగా ఆయన సినిమా నిర్మించారు, ఆ సమయంలో ఏర్పడిన స్నేహంతో పెళ్లి చేసుకున్నాం అంటూ వారి మత ఆచారాలను నేను గౌరవిస్తాను, తాను నా నమ్మకాలను గౌరవిస్తారు అంటూ చెప్పారు. అయితే ప్రస్తుతం తన తల్లితో పిల్లలతో వేరుగా ఉంటున్నట్లు ఆమని వివరించారు. ఇద్దరు పిల్లలు కాగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంకా చిన్న పిల్లలు అంటూ చెప్పారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…