Actress Aamani: తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటీమనులలో ఆమని ఒకరు ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆమని తన సినిమాల గురించి పలు విషయాలను తెలియచేశారు.
ముఖ్యంగా ఈమె నటించిన జంబలకడిపంబ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇవివి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో ఆడవాళ్లు మగవారిగాను మగవారు ఆడవాళ్ళగానో మారడం చాలా కొత్తదనంగా అనిపించింది. ఇప్పటికీ ఈ సినిమా చూసిన చాలా వినోద భరితంగా ఉంటుందని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో నరేష్ ఆమని జంటగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆమని తెలియజేశారు.ఈ సినిమాలో ఆడవారు మగవారిగాను మగవారు ఆడవారిగాను నటించాల్సి వచ్చింది. అయితే ఓ సందర్భంలో తాను సిగరెట్ కాలుస్తూ మందు తాగాల్సిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం డైరెక్టర్ గారు నాకు ముందుగా చెప్పలేదు.కేవలం బాటిల్ ఓపెన్ చేయగానే మందు మొత్తం పైకి పొంగుతుంది జస్ట్ ఒక సిప్ చేస్తే చాలు అని షూటింగ్ కు ముందు డైరెక్టర్ చెప్పారు.
ఇక బాటిల్లో కూల్ డ్రింక్ వేసి ఇస్తారని తాను అనుకున్నాను కానీ నిజంగానే నిజమైన బీర్ బాటిల్ తీసుకువచ్చారని ఆమని తెలిపారు.ఈ సినిమాలోని సన్నివేశం షూట్ చేసే సమయంలో హీరో నరేష్ గారు కూడా ఏం పర్వాలేదు తాగమ్మా అంటూ తనని బీర్ తాగమని ప్రోత్సహించారు అంటూ అప్పటి సంఘటనలను ఆమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా ఆమని చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…