Heroine Ankitha : రస్నా బేబీ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంకిత చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఆపైన తెలుగులో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో నటించి ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో వరుస ఆఫర్స్ అందుకుంది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘సింహాద్రి’లో గ్లామర్ పాత్రలో నటించి మంచి హిట్ ఎందుకుని అటు తమిళం ఇటు తెలుగులో మంచి ఆఫర్స్ అందుకుంది. అయితే ఆపైన వరుస ఫ్లాప్స్ అందుకోవడంతో అంకిత కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. విజయేంద్ర వర్మ, మనసు మాట వినదు వంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది అంకిత. తాజాగా అమెరికాలో స్థిరపడిన అంకిత ఒక ఇంటర్వ్యూలో కనిపించింది.
భర్త, పిల్లలు ఏం చేస్తారంటే…
అంకిత 2015 లో అమెరికా లో స్థిరపడిన ముంబై వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. భర్త సిటీ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తుండగా అంకిత ప్రస్తుతం పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తనది ప్రేమ వివాహం అని మొదట తానే ప్రపోజ్ చేయగా ఈ ప్రేమ డేటింగ్ వద్దు పెళ్లి చేసుకుందామని తన భర్త చెప్పడంతో పెళ్లి చేసుకున్నారట.
నవదీప్ తో గొడవ, ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్ బెస్ట్ ఫ్రెండ్స్…
ఇక సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ మనసు మాట వినదు సినిమాలో నటించేటపుడు నవదీప్ తో జరిగిన గొడవ గురించి చెబుతూ అది చాలా చిన్న గొడవ, ఇద్దరూ వేరే వేరే సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఒత్తిడికి లోనవ్వడం సహజమే అలా గొడవ జరిగింది ఆ తరువాత సద్ధుమణిగింది అంటూ చెప్పారు. ఇక తనకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అంటే ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ అంటూ చెప్పారు. ఉదయ్ కిరణ్ తో ఒక సినిమా మొదలయి మధ్యలోనే ఆగిపోయింది. కానీ మేము మంచి స్నేహితులం అయ్యాం అంటూ చెప్పారు. ఇక ఆర్తి అగర్వాల్ మంచి స్నేహితురాలు నా సోదరి పెళ్ళికి కూడా వచ్చింది. తాను అమెరికా వచ్చాక కలిసే వాళ్ళం. అయితే ఇంట్లో విషయాలు పెద్దగా నాకు తెలియదు, తన మరణానికి కారణం తెలియదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…