General News

రోజుకు ఎంత ఉప్పు సరిపోతుంది? నిపుణుల కీలక సూచనలు

భోజనం సమయంలో ఉప్పు తక్కువగా ఉందని అనిపిస్తే పైగా కొద్దిగా చల్లి తినడం చాలా మందికి సాధారణ అలవాటే. కానీ ఈ చిన్న అలవాటు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో చాలా మందికి తెలియదు. వైద్య నిపుణుల ప్రకారం, వండినప్పుడు కలిపే ఉప్పుతో పోలిస్తే, పచ్చిగా చల్లుకునే ఉప్పు శరీరంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది నేరుగా రక్తంలో సోడియం స్థాయిని పెంచి, రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుందని చెబుతున్నారు.

ఇలాంటి అలవాటు వల్ల ముఖ్యంగా రక్తపోటు సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. అధిక సోడియం కారణంగా గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బీపీ లేదా హార్ట్ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కేవలం రక్తపోటే కాకుండా, కిడ్నీలపై కూడా అదనపు భారాన్ని మోపుతుంది. శరీరంలో సోడియం అధికమైతే దాన్ని బయటకు పంపేందుకు కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీ పనితీరును దెబ్బతీయొచ్చు. అదే సమయంలో శరీరంలో నీరు నిలిచిపోవడం వల్ల వాపు, అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు.

ఎముకల ఆరోగ్యంపైనా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల క్యాల్షియం శరీరం నుంచి బయటకు పోయే అవకాశం పెరిగి, ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంటుంది. అలాగే నిద్రలేమి, తలనొప్పి, అధిక దాహం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

World Health Organization సూచనల ప్రకారం రోజుకు ఒక టీస్పూన్‌కు మించకుండా ఉప్పు తీసుకోవడం మంచిది. రుచి కోసం నిమ్మరసం, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్, పచ్చళ్లు, చిప్స్ వంటి వాటిలో సోడియం అధికంగా ఉండటంతో వాటిని పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Swathi N

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago