సాధారణంగా ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో అటు అమ్మాయి తరఫున ఇటు అబ్బాయి తరఫున పూర్తిగా ఎంక్వయిరీ చేసిన తర్వాత మాత్రమే పెళ్లిని నిశ్చయిస్తాము. ఇలా అటు ఇటు ఇరు కుటుంబాల గురించి ఎంక్వయిరీ చేసి పెళ్లి చేసినప్పుడే ఆ భార్య భర్తల జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. అలా కాకుండా వధువు ఇచ్చే కట్నకానుకలను చూసి పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇతని లాగే ఉంటుంది. అసలేం జరిగిందంటే…
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకోవాలని భావించాడు.ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తి తెచ్చిన సంబంధాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన రెండు నెలలకు గాను తన భార్య తనకు దగ్గర కాకపోవడంతో భర్త తన భార్య పై పలు అనుమానాలు వ్యక్తపరిచాడు.ఈ క్రమంలోనే తన భార్య తనకు దగ్గర కాకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే అందుకు ఆమె తనకు ఆరోగ్య సమస్య ఉందని చెప్పింది.
ఈ విధంగా తన భార్యకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో వెంటనే అతడు ఆమెను ఒక గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించాడు. అయితే ఈ వైద్య పరీక్షలలో వచ్చిన ఫలితాలను చూసి భర్త షాక్ కి గురి అయ్యాడు. అసలు తాను పెళ్లి చేసుకున్నది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలియడంతో సదరు వ్యక్తి తనకు పెళ్లి చేసిన మధ్యవర్తి తన అత్తమామల పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తమ తల్లిదండ్రులకు తన గురించి ముందుగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని దాచి పెళ్లి చేయడంతో వారి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పురుషుడిగా జన్మించిన తనకి లింగ మార్పిడి చేయడం వల్ల తన జననాంగాలు పూర్తిగా వృద్ధి చెందకపోవడం వల్లే ఆమె తన భర్తకు దగ్గర కావడానికి వెనకడుగు వేస్తోందని తెలియడంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అత్తమామలు, మధ్యవర్తి, మరో ఎనిమిది మంది పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…