Viral Video: దమ్ముంటే ఇక్కడకు వచ్చి మమ్మల్ని తినేయండి.. సవాల్ విసిరిన జింకలు… వీడియో వైరల్!
Viral Video: ప్రాణ భయం అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అటు మనిషికి అయినా.. ఇటు నోరులేని జంతువులకు అయినా. అయితే అటవీ ప్రాంతంలో మాత్రం.. క్రూర జంతువుల పని కేవలం వేట మాత్రమే. అంటే వాటి కంటే చిన్న ప్రాణి అయిన వాటిని వేటాడి తింటుంటాయి. అవే వాటికి ఆహారం. సింహాలు, పులులు అయితే జింకలను, దుప్పిలను వేటాడి మరీ తినడం మనం చాలా వరకు డిస్కవరీ చానళ్లో చూసి ఉంటాం.
అయితే వాటి బారి నుంచి తప్పించుకోవడానికి ఆ జింకలు పడే బాధ అంతా ఇంతా కాదు. వాటికి సాధ్యమైనంత వరకు పరుగు పెడతాయి. చివరకు చిరుత, పులుల పరుగుకు అవి తట్టుకోలేక పట్టుపడతాయి. ఇంకేముంది చటుక్కున నోటిలో పెట్టేసుకొని తింటాయి.
అయితే ఇక్కడ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఏముందంటే.. జింకలు తమను తాము కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అది. జింకలను పులి, సింహాలే కాదు.. అడవి కుక్కలు కూడా వేటాడుతాయి.
వాటికి దూరంగా ఉండేందుకు జింకలు ప్రయత్నాలు చేస్తుంటాయి. తాజాగా ఈ వీడియోలో అడవి కుక్కుల గుంపు ఒక్కసారిగా వాటిపై పడేందుకు ప్రయత్నిస్తాయి. ఈక్రమంలో వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ జింకలు ఓ మాస్టర్ ప్లాన్ వేశాయి. పక్కనే ఉన్న ఓ బండరాయిపై ఎక్కాయి. అది భూమికి చాలా ఎత్తులోనే ఉంది. ఆ మూడు జింకలు ఎత్తైన రాయి ఎక్కి.. తమను తాము కాపాడుకునే ప్రతయత్నం చేశాయి. అయితే కొన్ని కుక్కలు ఆ రాయి ఎక్కినా.. ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే.. ఆ జింకలు ఆ రాయికి చివరన నిల్చున్నాయి. అక్కడకు కుక్కలు వెళ్లలేక పోయాయి. అక్కడకు కనుకు కుక్కలు వెళ్లితే.. కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా కుక్కలకు అక్కడకు వెళ్లడం సవాల్ గా మారింది. కొన్ని కుక్కలు వాటిని చేరుకునేందుకు రాయి అంచు వరకు వెళ్లినా.. జింకలు మాత్రం వాటికి చిక్కలేదు. కుక్కల ప్రయత్నం విఫలం అవ్వడంతో.. అవి సేఫ్ అయ్యాయి. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…