ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(IGCAR) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేవలం పదో తరగతి అర్హతతో పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.స్టైఫండరీ ట్రైనీ, వర్క్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్(UDC), సెక్యూరిటీ గార్డ్, క్యాంటీన్ అసిస్టెంట్, టెక్నీషియన్ సైంటిఫిక్ ఆఫీసర్, వంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 337 పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ కోసం ఈనెల 15 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.స్టైఫండరీ ట్రైనీ, టెక్నీషియన్ బీ(క్రేన్ ఆపరేటర్), అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. స్టైఫండరీ ట్రైనీ, ఉద్యోగాల కొరకు డిప్లమా లేదా బీఎస్సీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 ఉద్యోగాల కొరకు పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ లో ఒక నిమిషానికి 80 పదాలను, హిందీలో ఒక నిమిషానికి 30 పదాలను టైప్ చేసే సామర్థ్యం ఉండాలి. ఇకపోతే అప్పర్ డివిజన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంగ్లీష్ లో నిమిషానికి ముప్పై పదాలను టైప్ చేయడంతోపాటు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఇక డ్రైవర్ ఉద్యోగాల అర్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదే విధంగా మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. సెక్యూరిటీ గార్డ్, క్యాంటీన్ అసిస్టెంట్, వర్క్ అసిస్టెంట్ మొదలైనవారు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 15వ తేదీ నుంచి మే 14 వరకు అధికారిక వెబ్ సైట్ igcar.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని సూచించింది
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…