ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(IGCAR) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేవలం పదో తరగతి అర్హతతో పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.స్టైఫండరీ ట్రైనీ, వర్క్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్(UDC), సెక్యూరిటీ గార్డ్, క్యాంటీన్ అసిస్టెంట్, టెక్నీషియన్ సైంటిఫిక్ ఆఫీసర్, వంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 337 పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ కోసం ఈనెల 15 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.స్టైఫండరీ ట్రైనీ, టెక్నీషియన్ బీ(క్రేన్ ఆపరేటర్), అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. స్టైఫండరీ ట్రైనీ, ఉద్యోగాల కొరకు డిప్లమా లేదా బీఎస్సీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 ఉద్యోగాల కొరకు పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ లో ఒక నిమిషానికి 80 పదాలను, హిందీలో ఒక నిమిషానికి 30 పదాలను టైప్ చేసే సామర్థ్యం ఉండాలి. ఇకపోతే అప్పర్ డివిజన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంగ్లీష్ లో నిమిషానికి ముప్పై పదాలను టైప్ చేయడంతోపాటు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఇక డ్రైవర్ ఉద్యోగాల అర్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదే విధంగా మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. సెక్యూరిటీ గార్డ్, క్యాంటీన్ అసిస్టెంట్, వర్క్ అసిస్టెంట్ మొదలైనవారు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 15వ తేదీ నుంచి మే 14 వరకు అధికారిక వెబ్ సైట్ igcar.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని సూచించింది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…