Imandhi Ramarao : సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అందమైన రూపంతో పాటు అందమైన గాత్రంతో అకట్టుకున్న సింగర్. ఆమె పాటను ఎంత వినసొంపుగా పాడుతుందో అంతే బాగా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పగలదు. వందల పాటలతో పాటు డబ్బింగ్ కూడా చెప్పిన సునీత వ్యక్తిగత జీవితం మాత్రం అంత మధురంగా సాగాలేదు. చిన్న వయసులో వివాహం అది కాస్తా బెడిసికొట్టి ఆ తరువాత మళ్ళీ పిల్లలను పెద్దవాళ్ళను చేసి ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్న సునీత చాలా ఆనందంగా తన జీవితానని కొనసాగిస్తోంది. ఇక ఆమె జీవిత విశేషాల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అయన అభిప్రాయాలను పంచుకున్నారు.
బాలు తో ఎనలేని అనుబంధం…
సింగర్ సునీత చూడటానికి చాలా సుకుమారంగా ఉన్నా చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది, తనజీవితం గురించి చాలా బోల్డ్ సమాధానాలు చెబుతుంది అంటూ ఇమంది గారు చెప్పారు. ఇక ఒకానొక అవార్డు ఫంక్షన్స్ ఏఆర్ రెహమాన్ ను అందరూ ప్రశంసిస్తున్న సమయంలో ఆయన గొప్ప కాదు ఆయన గురువు అంటూ ఇళయరాజా అంతటి వారు లేరు అంటూ చెప్పడం తన ధైర్యానికి నిదర్శనం అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.
అది రెహమాన్ ను కించపరచడం కాదు కేవలం ఇళయరాజా గొప్ప అందరికంటే అని చెప్పడం మాత్రమే అంటూ చెప్పారు. ఇక సింగర్ బాలు కి సునీతకి మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు ఇమంది గారు. పాటల పరంగా ఎక్స్ప్రెషన్స్ బాగా పలికించి పాడటంలో బాలు కి ఎవరూ పోటీ లేరు. ఇక సునీత కూడా ఆయనకు ధీటుగా భావాలు పలికిస్తూ పాటపడుతుంది అంటూ చెప్పారు. ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది, సునీత కు బాలు గారంటే చాలా ఇష్టం అలాగే గౌరవం. అదీకాక వాళ్ళు నిజంగా కూడా బంధవులు అవుతారు. ఆయన సునీత కు మావయ్య అవుతారు అంటూ ఇమంది గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మహిళలు ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, ఆహారపు అలవాట్ల మార్పులు…
వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా తన ముద్ర వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభమైన AI ఆధారిత…
పిజ్జా అంటే చాలామందికి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్. రుచికరమైన చీజ్, సాస్, టాపింగ్స్తో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నిపుణులు…
ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మలేరియా డేను నిర్వహిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి మలేరియా…
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై వచ్చిన కల్తీ ఆరోపణలపై నియమించిన ఏకసభ్య కమిషన్ తన దర్యాప్తును పూర్తి…
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25ను ప్రపంచ మలేరియా దినోత్సవంగా పాటిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన…