Gabbarsingh: గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పింది ఒకటి.. చూపించింది ఒకటి.. బెంగళూరు పద్మ షాకింగ్ కామెంట్స్!
Gabbarsingh: బెంగళూరు పద్మ ఈమె నటిగా ఎన్నో సినిమాలలోను బుల్లితెర సీరియల్స్ లోనూ నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే బెంగళూరు పద్మ స్వయాన హ్యాపీ డేస్ సినిమాలో అప్పు పాత్రలో నటించిన గాయత్రి తల్లి అనే సంగతి అందరికీ తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పద్మ హ్యాపీడేస్ చిత్రంలోని అప్పు పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందు అప్పు పాత్రలో నటించడం గాయత్రికి ఇష్టం లేదని అయితే ఈ పాత్రలో నటించాలంటే తనకు బాయ్ కట్ ఉండాలని చెప్పారు.తనకు జుట్టు బాగా పొడుగు ఉండేది తన జుట్టు కత్తిరించినప్పుడు చాలా ఏడ్చింది. అప్పుడు శేఖర్ కమ్ముల గారు తనకు పెద్ద చాక్లెట్ ఇచ్చి తనని కన్విన్స్ చేశారని ఈ సందర్భంగా తెలిపారు.
హ్యాపీడేస్ చిత్రం తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ ఫ్రెండ్ పాత్రలో ఈమె నటించారు. ఇక ఈ పాత్ర గురించి పద్మ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గాయత్రి ఒకసారి ఫోటో షూట్ చేయించుకుంది. ఆ ఫోటోలు చూసిన హరీష్ శంకర్ తనకు గబ్బర్ సింగ్ సినిమాకు ఇలాంటి పాత్రలో నటించే వాళ్ళు కావాలి అంటూ తనని సెలెక్ట్ చేశారని పద్మ తెలిపారు.
ఈ సినిమా కథ చెప్పేటప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే తన పాత్రకు మంచి గుర్తింపు ఉంటుందని భావించాము. తీరా చూస్తే హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో తనని చూపించారు అంటూ పద్మ ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాలోని తన కూతురు పాత్ర గురించి తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత తాను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇండస్ట్రీకి దూరమైందని పద్మ తన కూతురు గాయత్రి అలియాస్ అప్పు గురించి తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…