Categories: FeaturedGeneral News

మహాత్మాగాంధీ 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్య వేడుకల్లో ఎందుకు పాల్గొనలేదు.. దానికి కారణం ఏంటో తెలుసా..?

భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీతో పాటు ఎందరో మహానుభావులు పోరాడి.. 1947 ఆగస్టు 15 బానిస సంకెళ్లను తెంచి స్వాతంత్య్రాన్ని సాధించారు. అయితే ఆ సమయంలో ప్రతీ భారతీయుడు ఎంతో సంబరాలను జరుపుకున్నారు. కానీ ఆ సంబరాలలో మహాత్మాగాంధీ మాత్రం పాల్గొనలేదు.

దీనికి గల కారణం ఏంటంటే.. సరిగా 1947 ఆగస్టు 15న గాంధీ హిందూ, ముస్లిం మధ్య మత ఘర్షణలు జరుగుతుంటే.. వాటిని అడ్డుకోవడానికి దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీకి వెళ్లారు. స్వాతంత్ర్య దినోత్సవంలో మీరు పాల్గొనాలంటూ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ గాంధీకి లేఖ రాశారు. అయితే దానికి స్పందించిన మహాత్మాగాంధీ కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను.

ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తా అని అక్కడే ఉన్నారు. అంతే కాకుండా జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగాన్ని ఆగస్టు 14 న అర్థరాత్రి ప్రస్తుత రాష్ట్రపతి భవనం నుంచి ఇచ్చారు. అప్పట్లో రాష్ట్రపతి భవనంను వైస్రాయ్ లాంజ్ అనేవారు.

నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది.. కానీ, గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు. 1947 ఆగస్టు 15న లార్డ్ మౌంట్‌బాటన్ తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago