ప్రభుదేవా….. కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. డాన్సర్ గా, ఒక కొరియోగ్రాఫర్ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో అనేక చిత్రాలకు పనిచేశారు. కొరియోగ్రాఫర్ గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. “చికు బుకు చికు బుకు రైలే..” అంటూ ఇండియన్ సినిమాలో డ్యాన్స్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పాడు ప్రభుదేవా. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో అవార్డులు అందుకున్న ప్రభుదేవా వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుకులను ఎదుర్కొన్నాడు. అలాంటి ప్రభుదేవా గురించి ఎవ్వరికి తెలియని విషయాలు మీ కోసం…
ప్రభుదేవా…..1973 ఏప్రిల్ 3న మైసూరులో జన్మించాడు. ఈయన తల్లి పేరు మహదేవమ్మ, తండ్రి ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్. ప్రభుదేవా ది డాన్స్ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి సుందరం మాస్టర్ కూడా మంచి కొరియోగ్రాఫర్. ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఇంకా ప్రభుదేవా ఇద్దరు సోదరులు కూడా సోదరులు రాజ్ సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా డ్యాన్స్ మాస్టర్లు కావడం విశేషం.
కానీ కుటుంబంలో ఎవ్వరికి రానీ పేరు ప్రభుదేవాకు మాత్రమే వచ్చింది. కానీ ప్రభుదేవాకు చిన్నతనంలో డాన్స్ అంటే అంతగా నచ్చేది కాదట. ఫుట్ బాల్ అంటే ఎక్కువ ఇష్టముండేదట. దీంతో ఎక్కువ సమయం పుట్ బాల్ ఆటతోనే గడిపేవాడు. దీంతో తండ్రి సుందర మాస్టర్ డాన్స్ గురించి వివరించడట. ఆయన ప్రేరణతో డాన్స్ లోకి అడుగుపెట్టిన ప్రభుదేవా చిన్నప్పుడే భరత నాట్యం, వెస్ట్రన్ డాన్స్ నేర్చుకున్నాడు. అయితే ఆ కాలంలోనే ప్రభుదేవా స్టెప్పులు చూసిన వారంతా పెద్దవాడు అయ్యాక ఇండియన్ మైఖేల్ జాక్సన్ వి అవుతావని మెచ్చుకునేవారంట. అలా ప్రభుదేవా చిన్నప్పటి నుంచి డాన్స్ తోనే పెరిగాడు.
ఆ తర్వాత 1989లో కమల్ హాసన్ నటించిన వెత్రి విజా సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ గా చిత్రం రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పుడు ప్రభుదేవా వయస్సు కేవలం 16 ఏళ్ళు. అలా కొరియోగ్రాఫర్ గా కేరీర్ ను ప్రారంభించిన ప్రభుదేవా సక్సెస్ అయ్యాడు. బాలీవుడ్ లో కూడా రాణించాలకున్న ప్రభుదేవాకు అమితాబచ్చన్ తో కలిసిన పనిచేయ్యాలని ఉండేది. దాన్ని కల కూడా నెరవేర్చుకున్నాడు. అంతేకాదు అక్కడి స్టార్ హిరోలతో కూడా స్టెప్పులు వేయించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హిరోలతో కూడా స్టెప్పులు వేయించాడు.
ఇప్పటికీ కొరియోగ్రాఫర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ప్రభుదేవా కేవలం కొరోయోగ్రాఫర్ గానే ఉండిపోలేదు. యాక్టింగ్ కూడా చేశారు. 1994లో వచ్చిన “ఇందు” అనే చిత్రం ద్వారా వెండితెరకు నటుడిగా పరిచమయ్యాడు. పవిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రోజా హిరోయిన్ గా నటించారు. అప్పుడే తనలో ఉన్న నటుడు బయటకు వచ్చాడు. తన యాక్టింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆయన మొదటి చిత్రానికే నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. అనంతరం పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు.
అంతేకాదు డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటుకున్నాడు ప్రభుదేవా. ఆయన డైరెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా “నువ్వొస్తానంటే నేనొద్దంటానా…” సూపర్ డూపర్ హిట్ అయిన…..ఈ చిత్రానికి 9 ఫిలింఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు వచ్చాయి.
ప్రభుదేవా కేరీర్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట మాత్రం ముక్కాబులా ముక్కాబులా సాంగ్. ఈ పాట అప్పట్లో ఒక సెన్సెషన్ క్రియేట్ చేసింది. మళ్లీ అదే సాంగ్ ను స్ట్రీట్ డాన్సర్ సినిమాలో పెట్టి కొత్త స్టెప్పులు వేయించారు. హిందీలో కూడా ముక్కాబులా ముక్కాబులా సాంగ్ మంచి సక్సెస్ ను అందుకుంది. ఇండియన్ డాన్స్ కి కింగ్ అయిన ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా ఎన్నో నంది, ఫిల్మ్ ఫెర్, సైమా, అవార్డులను అందుకున్నాడు. రెండు జాతీయ అవార్డులను అందుకున్నాడు.
సినిమా రంగానికి ప్రభుదేవా అందిస్తున్న సేవాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రభుదేవాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదగా మన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ అవార్డును అందుకున్నారు. కేరీర్ పరంగా ఎంతో సక్సెస్ ను అందుకున్న ప్రభుదేవా వ్యక్తి గత జీవితంలో మాత్రం కొన్ని వివాదాలను ఎదుర్కొన్నాడు.
హిరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు నయనతారను పెళ్లి చేసుకోవడం కోసం తన భార్యకు విడాకులు ఇచ్చాడని… కానీ విడాకుల తర్వాత కూడా ప్రభుదేవా ఎక్కువగా మాజీ భార్య పిల్లలనే చూస్తున్నాడనే కారణంతో నయన్, ప్రభుదేవాతో పెళ్లి కాన్సిల్ చేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందనేది ఎవ్వరికి తెలియదు. ఈ పుకార్ల పై నయనతారగాని ప్రభుదేవా కాని నోరు విప్పలేదు.
ఆ సమయంలో మాత్రం ప్రభుదేవా కుటుంబంలో అనేక గొడవలు జరిగాయని అతని గురించి బాగా తెలిసిన వారు చేబుతుంటారు. అలా కొన్నాళ్ళు ప్రభుదేవా వ్యక్తిగతంగా సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయిన కూడా డాన్సర్ గా ఏ మాత్రం డౌన్ కాకుండా ఇంకా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు ప్రభుదేవా.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…