కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్యరంగాలతో పాటుగా వైన్స్ షాపులు కూడా మూతపడ్డాయి. అయితే ఒక వైపు మద్యం దొరక్క మందుబాబులు నానా అవస్థలు పడుతున్నా.. మద్యం షాపులు తెరవడానికి మాత్రం ససేమిరా అంటుంది తెలంగాణా ప్రభుతం. అయితే మందు చుక్క దొరక్క కొందరు పిచ్చెక్కి ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలు సైతం పాల్పడుతున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే ఇంకొందరు మాత్రం ఇదే అదునుగా చూసుకుని మద్యం చోరీలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వైన్ షాపులో జరిగింది.
మద్యం షాపు మూసివేసి ఉండటంతో మద్యం షాపు వెనుక భాగంలో రంద్రం పెట్టి లోపలకు చొరబడి సుమారు రూ. లక్ష రూపాయిల విలువైన మద్యం బాటిళ్లను దోచుకెళ్లారు. అదే క్రమంలో షాపులో ఉన్న కొంత నగదు కూడా ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ తతంగం అంతా ఆ షాపులో ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. అతి త్వరలో ఈ మద్యం దొంగలను పట్టుకుంటామని పొలుసులు చెబుతున్నారు.
కర్ణాటకలో కూడా ఇదేవిధమైన చోరీ జరిగినట్టు తెలిసింది. మంగుళూరు సమీపంలోని ఉల్లాల్ పట్టణంలో ఒక వైన్స్ లో చొరబడి సుమారు లక్ష విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీనిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు అక్కడి పోలీసులు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…