కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో 21రోజుల పాటు రైళ్లను నిలిపివేయడం జరిగింది. అయితే ఏప్రిల్ 15 నుంచి రైళ్లు తిరిగి ప్రారంభం అవుతున్నాయని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇదే విషయాన్నీ కొన్ని మీడియా ఛానళ్ళలోకూడా ప్రసారం చేసారు. అంతేకాకుండా రైళ్ల శాఖ రైళ్లను పునఃప్రారంభిస్తున్నారని, ఉద్యోగులను తమ తమ విధులకు హాజరుకావాలంటూ పిలుపునిచ్చిందని కూడా వార్తలు జోరుగా వచ్చాయి. అయితే దీనిపై కీలక ప్రకటన చేసింది రైల్వే మినిస్ట్రీ.
“లాక్ డౌన్ తరువాత నుంచి రైళ్లు నడిపే అంశంపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకోదంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ప్రయాణికుల రైళ్లను నడిపే అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనను రేల్వే శాఖ జారీ చేయలేదు. దీనికి సంబంధించిన ఏ విషయాన్నీ అయినా రైల్వే శాఖ సంబంధిత వర్గాలకు ముందుగా తెలియజేస్తుంది ” అంటూ రైల్వే మినిస్ట్రీ ట్వీట్ చేసింది.
ట్రైన్ బుకింగ్స్ పైన కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. రైల్వే టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియ ఎప్పుడు నిలిచిపోలేదని స్పష్టం చేసారు. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం 120 రోజుల ముందే ట్రైన్ టిక్కెట్ల రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ముందు నుంచే ఉందని, కేవలం లాక్ డౌన్ అమలులో ఉన్న మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 తేదీల వరకు జరిగే ప్రయాణాలకు మాత్రమే రద్దు చేయడం జరిగిందని స్పష్టం చేసింది. వేసవి సెలవుల దృష్ట్యా ఇప్పటికే మూడు నెలల ముందే అడ్వాన్స్ రిజర్వేషన్లు భారీ సంఖ్యలో జరిగాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుతం స్పష్టత ఇచ్చిన తరువాతే తాము ఒక నిర్ణయం తీసుకుంటామని రేల్వే శాఖ తెలిపింది.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…