Indraja : సుధీర్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ఒక మెజీషియన్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సుధీర్ 2013లో ప్రారంభం అయిన జబర్దస్త్ ప్రోగ్రాం వలన తెలుగు బుల్లితెరకి పరిచయం అయినాడు. జబర్దస్త్ ప్రోగ్రాంలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. శీను, రామ్ ప్రసాద్ తో కలసి టీమ్ లీడర్ గా స్కిట్లు చేస్తూ అభిమానులను సొంంతం చేసుకున్నాడు. జబర్దస్త్ మాత్రమే కాకుండా నా షో నా ఇష్టం, పోవే పోరా, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రాములకు హోస్ట్ గా వ్యవహారించాడు. కేవలం బుల్లితెర మీదనే కాకుండా వెండితేరా మీద కూడా అల్లరిస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ హీరోగా సినిమాలు తీస్తున్నాడు.
వాంటెడ్, పండుగాడు సినిమాలతో హీరోగా స్థిరపడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్న వార్తలు కూడా వస్తున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ లో సుధీర్ హీరోయిన్ ఇంద్రజ తో కలసి షో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ సుధీర్ ఎందుకు జబర్దస్త్ వీడాడో, తనకి సుధీర్ తో వున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
సుధీర్ జబర్దస్త్ ఎందుకు వీడాడో నాకు తెలుసు.. కానీ…
సుధీర్ కు జబర్దస్త్ షో వలనే క్రేజ్ వచ్చింది అనడం లో ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటిది సుధీర్ జబర్దస్త్ తో పాటు మరికొన్ని ప్రోగ్రాములకు ఎందుకు గుడ్ బై చెప్పాడు అని అభిమానులలో చాలా ప్రశ్నలు వున్నాయి. అయితే ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ తాను షోలలో సుధీర్ ని చాలా మిస్ అవుతున్నాని పేర్కొన్నారు. తనకన్నా వయసులో 8ఏళ్ళే చిన్నవాడు అయినప్పటికీ మా ఇద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం చాలా బాగా ఉంటుందని చెప్పారు.
ఇక సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్ళడానికి కారణం గురించి అడుగగా.. దానికి సమాధానం నాకు తెలుసు కానీ, ఇంకొకరి వ్యక్తిగత విషయాలను గురించి నేను మాట్లాడను అని సూటిగా చెప్పేసారు. సుధీర్, శీను, ఆది జబర్దస్త్ లో లేకపోవడం కారణంగా రేటింగులు తగ్గాయా అన్న ప్రశ్నకు కూడా అది నాకు సంబందించినది కాదు అంటూ.. మరోసారి దాటేశారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…