Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

Sad News: ప్రస్తుతం ఉన్న జీవవ విధానంతో చాలా మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. మాతృత్వ మాధుర్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఐవీఎఫ్, సరోగసీ చేసుకుంటూ పిల్లల్ని కంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆ మాతృత్వానికే మచ్చ తెస్తున్నారు.

Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!
Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

కావాలని నవజాత శిశువును ముళ్ల పొదల్లో, చెత్త కుండీల్లో వదిలి వెళుతున్నారు. ఎవరైనా చూస్తే బతికి బయటపడుతున్నారు. లేకపోతే.. మరణిస్తున్నారు. చిన్న పిల్లల్ని అన్ని ఉన్నా అనాథలుగా చేస్తున్నారు. తల్లిదండ్రులు తెలియక మనోవేధనకు గురవుతున్నారు. ఇలాంటి చాలా ఘటనలు దేశవ్యాప్తంగా చూస్తున్నాం.

Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

యుక్తవయసులో తప్పటడుగులు వేసి అబార్షన్లు చేయించుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. బయటకు తెలిస్తే సమాజం అవమానిస్తుందని గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకుంటున్నారు. బిడ్డలు పుడితే ఎక్కడో చోట విసిరేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. 

ముళ్ల పొదల్లో నవజాత శిశువు …

ఖమ్మం జిల్లా పెద్దమండవలో శుక్రవారం ఓ వీధిలో సీసీ రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. అయితే పూర్తిగా నెలలు నిండక ముందే శిశువును గర్భం నుంచి తొలగించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బందే.. శిశువును ఖననం చేశారు. ఇదిలా ఉంటే అదే గ్రామానికి చెందిన శిశువు మరణిస్తే ఖననం చేశారని.. కుక్కలు వెలికి తీసి పొదల్లోకి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.