Inspector Bendi Venkatarao : విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన న్యాయవాది వృత్తి చేస్తున్న గోదావరి మధుసూదన్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్ళు తన భార్యను చీకటి గదికి పరిమితం చేసాడు. పుట్టపర్తి కి చెందిన సాయి సుప్రియ అనే మహిళను 2008లో వివాహం చేసుకున్న గోదావరి మధుసూదన్ ఆమెను ఏకంగా 13 ఏళ్లుగా చీకటి గదికి పరిమితం చేసారు. కోర్ట్ సహాయంతో పోలీసులు ఆమెను నేడు విడుదల చేయగా 13 ఏళ్ల తరువాత ఆమె మొదటి సారి వెలుతురు చూసింది. ఇంత శాడిస్ట్ గా ఉన్న మధుసూదన్ రావు అతని కుటుంబం ఈ ఘటన మీద సమర్తించుకోవడం ఆశ్చర్యకరమైన విషయం.
మేము ఇంట్లోకి వెళ్లేసరికి…
దాదాపు 13 ఏళ్లుగా కూతురు ఎలా ఉందో తెలియక అల్లాడిన సాయి సుప్రియ తల్లిదండ్రులు చివరకు ఆమెను చూపించాలని కోర్ట్ ను ఆశ్రయించారు. అలా పోలుసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు, స్థానిక విఆర్ఓ సహాయంతో పోలీసులు మధుసూదన్ ఇంటిని తనిఖీ చేయగా సాయి సుప్రియ ఒక చీకటి గదిలో ఉండటం చూసారు. ఆమె బాగా బలహీనంగా ఉంది అంటూ ఇన్స్పెక్టర్ బెండి వెంకటరావు గారు తెలిపారు.
బయటకు ఆమెను తీసుకురాగానే వెలుతురు చూడగానే కళ్ళు గట్టిగా మూసుకుందని చీకటిలో ఇన్నేళ్లు ఉండటం వల్ల తాను వెలుతురు చూడలేక పోయిందని చెప్పారు. ఇక ఆమెను తన భర్త మానసికంగాను, శరీరకంగాను హింసించాడు అంటూ సాయి సుప్రియ తెలిపారని బెండి వెంకటరావు తెలిపారు. కోర్ట్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆమెను తన తల్లిదండ్రుల వద్ద ఉంచినట్లు చెప్పారు.
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…
హిందూ ఆలయాలకు వెళ్లే భక్తులు సాధారణంగా గర్భగుడిలో స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ…
హిందూ వివాహ సంప్రదాయం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చినా, దాని అంతర్భాగమైన ఆచారాలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.…
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన…
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో తులసిని దైవ స్వరూపంగా భావిస్తూ నిత్య…
హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. మన జీవితంలోని అనేక పరిణామాలు గ్రహాల ప్రభావంతోనే జరుగుతాయని విశ్వాసం. అందుకే…