Featured

శ్రీ ఆంజనేయం అని దేవుడు పేరు పెట్టి బూతు సినిమా తీశాడంటూ కృష్ణవంశీని ఏకేయడానికి కారణం ఇదే..

సామాజిక అంశాలకి పక్కా కమర్షియల్ అంశాలను జోడించి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాలు తీస్తూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన మేకింగ్ స్టైల్ కాస్త అటు ఇటుగా ఆయన గురువు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మలాగా ఉంటుందని కొన్ని సినిమాలలో అనిపిస్తుంది. కానీ సినిమా మీద పూర్తిగా మాత్రం తన మార్క్ ఉండేలా తన క్రియేటివిటీని చూపిస్తుండటం గొప్ప విషయం.

కృష్ణవంశీ కొత్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. హీరో కోసం కథ రాయని దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా వాళ్ల ఇమేజ్‌కి తగ్గట్టు సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. గులాబి, అంతపురం, మురారి, ఖడ్గం లాంటి ఇండస్ట్రీ హిట్స్ కృష్ణవంశీ ఖాతాలో ఉన్నాయంటే ఆయన సినిమా సినిమాకి ఎంత వెరియేషన్ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు.

కృష్ణవంశీ కెరీర్ ప్రారంభంలోనే కింగ్ నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. గులాబి సినిమాలో ఆయన తీసిన పాటలు చూసిన నాగార్జున ఈ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అందుకే నాగార్జున మళ్ళీ కృష్ణవంశీకి చంద్రలేఖ సినిమా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో సాంగ్స్ హిట్ అయినప్పటికీ సినిమా మాత్రం ఫ్లాప్‌గా మిగిలింది. ఆయన తీసిన సముద్రం సినిమా మేకింగ్ పరంగా ఆయనకి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. ఇక అంతఃపురం కృష్ణవంశీ కెరీర్ లో మైల్ స్టోన్ లా ఎప్పటికీ నిలిచే సినిమా. దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం అందుకున్నారు.

ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మురారి సినిమా తీసి భారీ హిట్ అందుకున్నాడు. ఒక సాంగ్ విషయంలో ఏకంగా కృష్ణ గారితోనే వాదనకి దిగిన సందర్భం ఉంది. ఇలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు నితిన్ – అర్జున్ లాంటి స్టార్స్‌తో శ్రీ ఆంజనేయం తీస్తున్నాడంటే అందరిలో ఉండే అంచనాలు అసాధారణం. భక్తి ప్రధానమైన సినిమాతో కృష్ణవంశీ మాయ చేయడం ఖాయమని భారీ అంచనాలు పెట్టుకుంటారు. అసలు టైటిల్ చూసి ప్రేక్షకులు ఊహించుకునేదే వేరు. కానీ ఇందులో హీరోయిన్‌గా నటించిన ఛార్మీ శృతి మించిన శృంగార సన్నివేశాలు ఎబ్బెట్టుగా అనిపించాయి.

శ్రీ ఆంజనేయం అనే టైటిల్ పెట్టి ఓ బూతు సినిమా తీశాడంటూ కృష్ణవంశీని కామెంట్ చేశారు. అసలు కథలో ఛార్మీ అవసరం ఏంటీ అంటూ ప్రశ్నించిన వాళ్ళూ ఉన్నారు. రొమాంటిక్ సాంగ్.. ఆంజనేయ స్వామీ భక్తుడిగా నటించిన నితిన్‌ని టెంప్ట్ చేసే సీన్స్ చూసి అభిమానులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అప్పట్లో వరుసగా కృష్ణవంశీ ఛార్మీతో మూడు సినిమాలు చేశాడు. దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ గుస గుసలు వినిపించాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఆయన లేకుంటే ఆర్జీవీ ఇలా ఉండేవాడు కాదు.. జీవితాన్ని మలిచిన వ్యక్తి ఎవరంటే?

తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

46 minutes ago

సినిమాల కోసం ఆస్తులు అమ్మేసిన నటుడు..కళ్ళు చిదంబరం జీవితం వెనుక నిజాలు

తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…

2 hours ago

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

12 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

12 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

12 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

12 hours ago