Connect with us

Featured

అంత గొప్ప సినిమా తీసిన అయోధ్య కుమార్ ఇలాంటి చెత్త సినిమా తీస్తాడని ఎవరూ అనుకోలేదు.!

Published

on

సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప సినిమా తీసి విమర్శకుల  ప్రశంసలు అందుకున్న దర్శకులే కమర్షియల్ సక్సెస్ కోసం ఆ తర్వాత చెత్త సినిమా తీసి అడ్రెస్ లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరిలో అగ్ర దర్శకులు నుంచి మూడు నాలుగు భారీ హిట్స్ తీసిన దర్శకులు ఉన్నారు. ఆ కాలంలో అసభ్యకరమైన సన్నివేశాలు ఒకటి రెండు ఉండేవేమోగానీ, సినిమా మొత్తం ఆశ్లీలమైన సన్నివేశాలతో నింపేసి జనాల మీదకి వదిలిన దర్శక, నిర్మాతలు ఉండేవారు కాదు. అందుకు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ తరం హీరోలు ఆ తర్వాత తరం అయినా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు కూడా ఒప్పుకోలేదు.

Advertisement

అప్పట్లో కథ పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలని అందరికీ నచ్చాలనే కఠినమైన నిర్ణయం, ఉద్దేశం తోనే నాగి రెడ్డి లాంటి అగ్ర నిర్మాతలు, రామానాయుడు, నాగేశ్వర రావు, కృష్ణ లాంటి వారు భావించి సినిమాలు తీసేవారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద నెమ్మదిగా బాలీవుడ్ సహా, మలయాళ సినిమాల ప్రభావం పడుతూ వచ్చింది. దాంతో సినిమాలలో కొంత ఆశ్లీలమైన సన్నివేశాలకి చోటు ఏర్పడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొన్ని శృంగారభరితమైన సన్నివేశాలు ఉండాలని కొంతమంది మేకర్స్ ఓ దారి వేశారు.

దానివల్ల జనాలకి కలిగే మేలేంటో గానీ యువత మీద మాత్రం బాగానే ప్రభావం చూపించిందని చెప్పక తప్పదు. రాజకీయాలు, సినిమాలు జనాల మీద ఎంతగా ప్రభావం చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలలో కథ కంటే సన్నివేశాలకే ప్రధాన్యం పెరిగింది. మారుతి లాంటి కొందరు దర్శకులు కెరీర్ ప్రారంభంలో సక్సెస్ అవ్వాలంటే సినిమా మొత్తం అభ్యంతరకమైన సన్నివేశాలు చూపించి క్లైమాక్స్ లో మాత్రం సోషల్ మెసేజ్ ఇచ్చి ఏదో ఉద్దరించినట్టు చూపించారు. ఇదే ఓ ట్రెండ్ అయిపోయింది.

దాంతో సగం సినిమాలు ఏదో దొరికిన కెమెరాతో ముక్కు మొహం తెలియని వాళ్లని పెట్టి ఘాటు ముద్దు సన్నివేశాలు, పాటలలో ఆశ్లీలత చూపించడం మొదలు పెట్టారు. అలాంటి సినిమాలు ఒకదశలో యూత్‌ను బాగానే ఆకట్టుకున్నాయి. మలయాళంలో షకీలా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఆమె సినిమా రిలీజ్ అంటే మోహన్ లాల్ మమ్ముటి లాంటి అగ్ర హీరోల సినిమాలు కూడా ఆపేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దాంతో మంచి కథలతో సినిమా తీసి సక్సెస్ కావాలని వచ్చిన దర్శకులు తప్పని పరిస్థితుల్లో జనాలకి కావాల్సింది చూపించాల్సిందే అనే ధోరణికి వచ్చి చెత్త సినిమాలు తీసి అడ్రస్ లేకుండా పోయారు.

అలాంటి ఓ దర్శకుడే కృష్ణంశెట్టి అయోధ్యకుమార్. ఆయన మొదట తీసిన సినిమా మిణుగురులు. ఇలాంటి సినిమా తీయాలంటే మనసులో నుంచే బలమైన ఆలోచన కలగాలి. ఎంత ప్రేరేపితం కాకపోతే మొదటి సినిమా కథను ఇలా ఎంచుకుంటారు. దాదాపు 40మంది అంధ బాల, బాలికలతో సినిమా చేయడం అంటే చాలా పట్టుదల, ఓర్పూ ఉండాలి. చూపు లేని వాళ్ళకి సన్నివేశం వివరించడం దగ్గర్నుంచి చిత్రీకరణ జరపడం, డబ్బింగ్ చెప్పించడం వరకు చాలా సవాళ్ళను ఎదుర్కోవాలి.

అన్నీ సవాళ్ళను ఎదుర్కొని ఫస్ట్ కాపీ వచ్చాక సినిమాకి థియోటర్స్ దొరక్కపోతే.. ఇలాంటి సినిమాను ఎవరు చూస్తారనే కామెంట్స్ వస్తే దర్శకుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే మిణుగురులు సినిమాను చూసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు దర్శకుడు అయోధ్యకుమార్‌ను మెచ్చుకోవడమే కాదు సినిమా థియోటర్స్‌లో రిలీజ్ అయ్యేందుకు సహయపడ్డారు. ఆయన తీసుకున్న చొరవతో మిణుగురులు విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా అయోధ్యకుమార్‌కి గొప్ప పేరొచ్చింది.

అయితే ఆయన కమర్షియల్ డైరెక్టర్ కాదు.. కమర్షియల్ సినిమా చేయలేడు అనే ముద్ర పడటంతో రెండవ సినిమా అవకాశం దక్కలేదు. దాంతో కుమారి 21 ఎఫ్ లాంటి సినిమా ప్రభావంతో 24 కిసెస్ అనే టైటిల్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పక్కా స్టోరీ బోర్డ్ రెడీ గా ఉన్నా లో బడ్జెట్ అయినా, ఏ నిర్మాత దర్శకుడు అవకాశాలు ఇవ్వలేదు. 2015 – 16లోనే 24 కిసెస్ కథ రెడీ అయింది. కానీ ఈ సినిమా మొదలై రిలీజ్ కావడానికి దాదాపు మూడేళ్ళు పట్టింది. అయితే మిణుగురులు తీసిన దర్శకుడేనా ఇలాంటి చెత్త సినిమా తీసింది అనే నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కున్నాడు అయోధ్యకుమార్. దాంతో మళ్ళీ సినిమా రాలేదు. అయితే శేఖర్ కమ్ముల మాదిరిగా నెమ్మదిగా సినిమా చేసుకుంటూ వస్తే మాత్రం అయోధ్యకుమార్ చాలా గొప్ప దర్శకుడవడం మాత్రం గ్యారెంటీ అనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jani Master: జానీ మాస్టర్ కి బిగ్ షాక్… అవార్డు వెనక్కి తీసుకోవాలటూ ఆదేశాలు?

Published

on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయన మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.

Advertisement

ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి ఈయన పోలీసు విచారణలో పలు విషయాలను తెలిపారు. ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ కి కోర్టు మద్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఈయనకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్ట్ వెల్లడించారు.

ఈ విధంగా జానీ మాస్టర్ బయటకు వస్తున్నారని సంబరపడేలోపు ఈయనకి ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడానికి కంటే ముందుగా ఈయన 70వ జాతీయ అవార్డు ప్రకటనలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి.

అవార్డు వెనక్కి…
ఇలా నేషనల్ అవార్డుకు ఎంపికైన తరువాత ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డు సమితి ఈ అవార్డును వెనక్కి తీసుకోబోతున్నారు.మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చిందని సంతోష పడిన అభిమానులకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!

Published

on

Balakrishna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. దాంతో ఇప్పటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసాను ఇచ్చారు.

Advertisement

అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలయ్య బాబు. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా, అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌ గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

కారణాలు అవే అంటూ..

అయితే బాలయ్య బాబు రియాక్ట్‌ కాకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చనీ టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతు దారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు,బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరి నిదానంగా అయినా బాలయ్య బాబు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి మరి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!

Published

on

Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది దేవర సినిమా. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర.

Advertisement

తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు దేవర 2 గురించి చర్చించుకుంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది.

మేజర్ సీన్స్ అయిపోయాయి..

ఆల్రెడీ కథ సిద్దమైపోయింది. దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఒక రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు తారక్. ఇక ఈ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ మాటలను బట్టి చూస్తే కొరడాల శివ నెక్స్ట్ సినిమా దేవర2 అని తెలుస్తోంది. పార్ట్2 పూర్తి అయిన తర్వాతనే తదుపరి సినిమాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!