80’హీరోల్లో ఆ నలుగురు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ప్రధానమైన వారుగా చెప్పుకోవచ్చు. 1980 దశకంలో ఆ నలుగురు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి తమను తాము నిరూపించుకున్నారు.
అలాంటి ఈ సినీ పరంపరలో సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో నటిస్తూ తమ అభిమానులనే కాకుండా ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించారు. ఈ హీరోలు డాక్టర్, పోలీస్ ఆఫీసర్ లాంటి పాత్రలలో నటించిన చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ క్రమంలో ఈ నలుగురు వకీల్ సాబ్ గా కూడా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
1983, క్రియేటివ్ కమర్షియల్స్, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “అభిలాష” చిత్రం విడుదలైంది. ఇందులో చిరంజీవి, రాధిక హీరో, హీరోయిన్లుగా నటించారు. రావుగోపాల్ రావు ఒక పేరు మోసిన “వకీల్ సాబ్”గా కనిపించారు. చిరంజీవి (వకీల్ సాబ్)తన తండ్రికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఐపిసీ 302 రద్దు చేయాలనే కథాంశంతో అభిలాష సినిమా తెరకెక్కింది.
1992, శ్రీ రాజీవ్ ప్రొడక్షన్స్, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ధర్మక్షేత్రం” విడుదలయింది. ఈ చిత్రంలో బాలకృష్ణ, దివ్యభారతి హీరో, హీరోయిన్లుగా నటించారు. బాలకృష్ణ ఈ సినిమాలో వకీల్ సాబ్ గా కనిపించారు. సమాజంలో జరిగే అన్యాయాలను వకీల్ సాబ్ గా ఇండియన్ పీనల్ కోడ్ లను ఉపయోగిస్తూ అక్రమాలను అరికడుతుంటాడు.
1996, సురేష్ ప్రొడక్షన్స్,సురేష్ కృష్ణ దర్శకత్వంలో “ధర్మ చక్రం” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో వెంకటేష్, ప్రేమ హీరో, హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ తను ప్రేమించిన అమ్మాయి చావుకు కారణం తన తండ్రి అని తెలియడంతో అతని పై న్యాయ పోరాటానికి వకీల్ సాబ్ గా వెంకటేష్ రంగంలోకి దిగుతాడు.
2001, లక్ష్మీప్రసన్న పిక్చర్స్, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో అధిపతి చిత్రం విడుదలయింది. ఇందులో మోహన్ బాబు, ప్రీతి జింగానియా, నాగార్జున సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ సినిమాలో నాగార్జున సౌందర్యలది గెస్ట్ అప్పియరెన్స్ అని చెప్పవచ్చు. మోహన్ బాబు తరపున కోర్టులో కేసు వాదించే “వకీల్ సాబ్”గా నాగార్జున నటించారు. ఇలా ఆ నలుగురు వకీల్ సాబ్ లుగా నటించి ప్రేక్షకులను ఆరోజుల్లో రంజింపజేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…