బుల్లితెరపై కమెడియన్ గా, యాంకర్ గా, మెజీషియన్, నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెజీషియన్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత జబర్దస్త్ స్టేజ్ పై అడుగు పెట్టారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సుధీర్ ఏకంగా టీమ్ లీడర్ గా ఎదిగారు.అలాగే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ తర్వాత పలు కార్యక్రమాలలో చేస్తూ బిజీగా ఉన్నారు.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మాత్రమే కాకుండా ఢీ కార్యక్రమం, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు.శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా యాంకర్ గా కొనసాగుతున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఏ మాత్రం ఖాళీగా లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు.
ఈ విధంగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సుధీర్ వెండితెరపై కూడా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న సుధీర్ ఆస్తిపాస్తులను కూడా బాగా వెనకేసుకున్నట్టు తెలుస్తుంది. సుధీర్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కావస్తుండడంతో ఆస్తులను కూడా బాగా సంపాదించారని తెలుస్తోంది.
నెలరోజులలో ఏమాత్రం ఖాళీ లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్న సుదీర్ సంవత్సరానికి సుమారు 40 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఆస్తుల విషయాలు బయటపెట్టడంతో సుడిగాలి సుదీర్ తనకు హైదరాబాద్లో రెండు ఇళ్లు ఉన్నాయనే విషయాన్ని తెలియజేశారు. ఇంత పెద్ద మహానగరంలో ఒక ఇల్లు ఉండడమే గగనం అయితే సుధీర్ ఏకంగా రెండు ఇళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక స్థిరాస్తులు కూడా సుదీర్ కు బాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే సుధీర్ ఆస్తి సుమారు 5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే సుదీర్ ఇంతటి స్థాయికి చేరుకొని ఆస్తులను కూడా పెట్టడంతో ఈ విషయం తెలిసిన వాళ్లు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…