Rohini: రోహిణి పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఇదివరకు పలు బుల్లి తెర సీరియల్స్ లో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు వెండి తెర సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఇక ఈమె 2014వ సంవత్సరంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ సీరియల్ లో కమెడియన్ గా ఎంతో అద్భుతమైన నటనను కనబరిచినందుకు ఈమెకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇలా ఈమెకు నంది అవార్డుతో పాటు పదివేల రూపాయల క్యాష్ ప్రైస్ కూడా 2018లో ప్రకటించారు.
ఇకపోతే తాజాగా ఈమెకు నంది అవార్డు రాబోతున్నట్లు ప్రకటించినటువంటి ఒక లెటర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నాకు నంది అవార్డు ప్రకటించినందుకు చాలా సంతోషపడ్డాను ఇలా నంది అవార్డుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉండేదని అయితే ఇప్పటివరకు నాకు నంది అవార్డు మాత్రం ఇవ్వలేదు అంటూ ఈమె తెలియజేశారు.
ఇప్పటివరకు నంది అవార్డు ఇవ్వలేదు..
ఇలా గత విషయాలను ఇప్పుడు ఈమె గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్టు ఫైనల్ గా మారడంతో పలువురు ఈ పోస్ట్ పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఇప్పటివరకు ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించలేదని పరోక్షంగా సెటైర్స్ వేస్తున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డు పేరులను గద్దర్ అవార్డులుగా మార్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ అవార్డులను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.
https://www.instagram.com/actressrohini/p/C3QOFWSxn6U/
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…